తుపాను కార‌ణంగా రూ. 20 వేల కోట్ల న‌ష్టం

Spread the love

ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిల

అమ‌రావ‌తి : రాష్ట్రంలో మొంథా తుపాను దెబ్బ‌కు పెద్ద ఎత్తున న‌ష్టం జ‌రిగిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. 20 ల‌క్ష‌ల హెక్టార్ల‌కు పైగా రైతులకు న‌ష్టం వాటిల్లింద‌న్నారు.
వేరుశెనగ 1.50 లక్షల ఎకరాలు..మొక్క జొన్న 2.50 లక్షల ఎకరాల్లో నష్టం జరిగిందన్నారు. తుఫాన్ కారణంగా దాదాపు 20 వేల కోట్ల నష్టం వాటిల్లింద‌న్నారు. రాష్ట్రంలో రైతులు తీర్వ ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నారు. కూటమి పాలనలో పండిన పంటకు సైతం గిట్టుబాటు లేదన్నారు. ఒక్కో ఎకరాకు రైతు దాదాపు 35 వేల వరకు పెట్టుబడి పెట్టారని అన్నారు. ఇప్పుడు మొత్తం పోయిందని బాధ పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతాంగానికి ఇంత నష్టం జరిగితే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మ‌దీ నోరు విప్ప లేద‌ని మండిప‌డ్డారు.

మోడీ రాష్ట్రానికి వ‌స్తున్నారు వెళుతున్నార‌ని, కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన హామీలు ఏవీ అమ‌లుకు నోచుకోలేద‌న్నారు. కానీ రాష్ట్ర సమస్యల మీద మాత్రం మాట్లాడక పోవ‌డం దారుణ‌మ‌న్నారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. ఇప్పటికే రాష్ట్ర హక్కుల మీద అన్ని రకాలుగా మోసం చేశారని వాపోయారు. మోడీకి మోసం చేయడం అలవాటు గా మారితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చూసి మురిసి పోతున్నారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ నిలబడి ఉంది అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మద్దతుతోనేన‌న్న విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. ఆంధ్ర రాష్ట్రం అంటే కేవలం ఓట్లు మాత్రమేన‌న్న అభిప్రాయం ఉంద‌న్నారు. రాష్ట్రంలో ఉచిత పంట బీమా పథకానికి దిక్కు లేదన్నారు. గత YCP పాలనలో మూడేళ్లు బీమా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం ఉచిత భీమా అమలు చేయడం లేదని ఆరోపించారు.

  • Related Posts

    ఆల‌యాల అభివృద్దికి భారీగా నిధులు

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్ రెడ్డి జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో నిధుల కొర‌త లేద‌న్నారు. ఆల‌యాల అభివృద్దికి తాము కృషి చేస్తున్నామ‌ని చెప్పారు.…

    లౌకిక వాదానికి నియంతృత్వానికి మ‌ధ్య పోటీ

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన ఏఐసీసీ జీఎస్ కేసీ వేణుగోపాల్ త‌మిళ‌నాడు : ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మిళ‌నాడులో ఈనెల 23న ఎన్నిక‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇండియా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *