జర్మన్ కౌన్సుల్ జనరల్ తో భేటీ అయిన రేవంత్
హైదరాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకు పోతోందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం ర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం సీఎంతో భేటీ అయ్యింది. డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో ఇవాళ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. GCC ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు ఎ. రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ GCC ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు వారు తెలిపారు. హైదరాబాద్ లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహకరించాలని వారిని కోరారు ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి. ఈ భేటీలో అమిత దేశాయ్, డ్యుయిష్ బోర్స్ CIO/COO డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






