తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి : సీఎం

Spread the love

జ‌ర్మ‌న్ కౌన్సుల్ జ‌న‌ర‌ల్ తో భేటీ అయిన రేవంత్

హైద‌రాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల‌లో దూసుకు పోతోంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంగ‌ళ‌వారం ర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం సీఎంతో భేటీ అయ్యింది. డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్ లో ఇవాళ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. GCC ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు ఎ. రేవంత్ రెడ్డి.

హైదరాబాద్ డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ GCC ఏర్పాటుతో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో వెయ్యి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు వారు తెలిపారు. హైదరాబాద్ లో జర్మనీ టీచర్లను నియమించి తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించేందుకు సహకరించాలని వారిని కోరారు ఈ సంద‌ర్బంగా రేవంత్ రెడ్డి. ఈ భేటీలో అమిత దేశాయ్, డ్యుయిష్ బోర్స్ CIO/COO డాక్టర్ క్రిస్టోఫ్ బోమ్, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    రైతుల సంక్షేమం స‌ర్కార్ ల‌క్ష్యం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా : త‌మ ప్ర‌భుత్వం రైతు సంక్షేమం కోసం ప‌ని చేస్తుంద‌ని చెప్పారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలన అంటే రైతు సంక్షేమం, రైతు క్షేత్రం…

    తెలంగాణ పాలిట శాపంగా మారిన సీఎం

    Spread the love

    Spread the loveఅస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోం హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం పాలిట శాపంగా మారాడ‌ని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. శ‌నివారం ఆయ‌న మీడియాతో హైద‌రాబాద్ లో మాట్లాడారు. ఈరోజు శాంతి ర్యాలీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *