ప్రకటించిన విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం : ఏపీ సర్కార్ ఈనెల 14, 15వ తేదీలలో విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకమైన సీఐఐ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఈ సందర్బంగా కీలక వివరాలు వెల్లడించారు మంత్రి నారా లోకేష్. CII భాగస్వామ్య సదస్సుకు 45 దేశాల నుండి 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేక మందిని ఆకర్షిస్తోందని లోకేశ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని, పారిశ్రామిక వృద్ధికి దారితీస్తోందని అన్నారు . సమ్మిట్పై మంత్రుల బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. రెండు రోజుల సమావేశానికి అనేక మంది ప్రతినిధులను తీసుకు రావడానికి క్లస్టర్ ఆధారిత విధానం , సిబిఎన్ (ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు) బ్రాండ్ ఇమేజ్ను హైలైట్ చేస్తున్నట్లు చెప్పారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రభావాన్ని బలపరుస్తూ, గూగుల్ ఏఐ డేటా సెంటర్ హబ్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, నిప్పాన్ స్టీల్ (ఇండియా), కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి పెద్ద ప్రాజెక్టులు రికార్డు సమయంలోనే పూర్తయ్యాయని ఆయన అన్నారు. రూ.9.8 లక్షల కోట్ల విలువైన 410 ఎంఓయూలను ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాలలో నంబర్ 1గా మార్చడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించాలని కోరారు నారా లోకేష్. షిప్పింగ్, పునరుత్పాదక ఇంధనం, పోర్టు ఆధారిత అభివృద్ధి, ఏరోస్పేస్, రక్షణ, వ్యవసాయ ఆధారిత, లాజిస్టిక్స్, పెట్రోకెమికల్స్తో పాటు పర్యాటకం, విద్యలో భారీ పెట్టుబడి సామర్థ్యాన్ని ప్రస్తావించారు.






