చేనేత రంగాన్ని బ‌లోపేతం చేస్తాం

ప్ర‌క‌టించిన మంత్రి నారా లోకేష్‌

విజ‌య‌వాడ : ఏపీ వైద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం విజయవాడ ఎంజీ రోడ్డులోని శ్రీ శేషసాయి కల్యాణ వేదికలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వసంతం-2025’ చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత, చేతివృత్తుల కార్మికులు తయారు చేసిన వివిధ ఉత్పత్తులతో ఉన్న 70కిపైగా స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. ప్రకృతి సహజసిద్ధ రంగులతో తయారు చేసిన ‘కొత్తూరు వసంత వర్ణ’ నూతన చేనేత బ్రాండ్ ను మంత్రి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఎస్.రంజన, ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ సుజాత, సౌభాగ్యలక్ష్మి, పద్మ, శైలజ పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌ను ప‌రిశీలించారు. త‌యారీదారుల‌తో సంభాషించారు. ప్ర‌తిభా, నైపుణ్యం క‌లిగిన క‌ళాకారులు, చేతి వృత్తి ప‌నివార‌ల‌ను గుర్తిస్తామ‌న్నారు. వారికి అన్ని విధాలుగా స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు. గ‌త స‌ర్కార్ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసింద‌న్నారు. కానీ తాము వ‌చ్చాక ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఏపీ చేనేత బ్రాండ్ ను విస్త‌రించేలా చేస్తామ‌న్నారు నారా లోకేష్‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *