సేవా కార్య‌క్ర‌మాల‌తోనే జీవితానికి సార్థ‌క‌త

Spread the love

హెరిటేజ్ సంస్థ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి

లండ‌న్ : జీవితంలో మ‌రిచి పోలేని స‌న్నివేశం ఇద‌ని , తాను ఏనాడూ పుర‌స్కారాలు అందుకుంటాన‌ని అనుకోలేద‌ని అన్నారు హెరిటేజ్ సంస్థ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి. లండ‌న్ వేదికగా జ‌రిగిన పుర‌స్కార మ‌హోత్స‌వంలో ఆమె పాల్గొన్నారు. భువ‌నేశ్వ‌రితో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ప్ర‌వాస ఆంధ్రులు కూడా పాల్గొన్నారు. ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డుతో పాటు సంస్థ‌ను మెరుగైన రీతిలో నిర్వ‌హిస్తున్నందుకు గాను ఎండీ హోదాలో మ‌రో అవార్డును అందుకున్నారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు నారా భువ‌నేశ్వ‌రి.

త‌న ప‌నితీరును గుర్తించి స‌త్క‌రించినందుకు సంస్థ‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌న భ‌ర్త సీఎం చంద్ర‌బాబు, కొడుకు నారా లోకేష్‌, కోడ‌లు బ్రాహ్మ‌ణి, సోద‌రుడు, న‌టుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌తో పాటు నంద‌మూరి కుటుంబానికి కూడా థ్యాంక్స్ తెలియ చేశారు . అంతేకాకుండా త‌న‌కు జ‌న్మ‌ను ఇచ్చిన త‌ల్లిదండ్రులు నందమూరి తార‌క రామారావు, నంద‌మూరి బ‌స‌వ‌తార‌కం కు రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పారు నారా భువ‌నేశ్వ‌రి. వారు లేక పోతే తాను లేన‌ని అన్నారు. త‌న భ‌ర్త నుంచి తాను ఎంతో నేర్చుకున్నాన‌ని చెప్పారు. జీవితంలో ఆటుపోట్లు ఎంత‌టి వారికైనా వ‌స్తుంటాయ‌ని, ఆ స‌మ‌యంలో అధైర్య ప‌డ‌కుండా ముందుకు సాగాల‌ని పిలుపునిచ్చారు. ఈ అవార్డులు త‌న‌పై మ‌రింత బాధ్య‌త‌ను పెంచేలా చేశాయ‌న్నారు.

  • Related Posts

    బీఎంసీ ఎన్నిక‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాలి : రాహుల్ గాంధీ

    Spread the love

    Spread the loveప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసిన ఈసీ ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ ఎన్నిక‌ల (బీఎంసీ) లో పెద్ద ఎత్తున ఓటు చోరీ జ‌రిగింద‌ని ఆరోపించారు. శుక్ర‌వారం…

    ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు

    Spread the love

    Spread the loveసీఎంపై నిప్పులు చెరిగిన జ‌గ‌న్ రెడ్డి అమ‌రావ‌తి : ఏపీలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం న‌డుస్తోంద‌ని మండిప‌డ్డారు. త‌మ పార్టీకి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *