సామాజిక త‌త్వ‌వేత్త‌ శ్రీ భ‌క్త క‌న‌క‌దాస

Spread the love

నివాళులు అర్పించిన మంత్రి లోకేష్

అనంత‌పురం జిల్లా : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌ముఖ సామాజిక త‌త్వ‌వేత్త‌, స్వ‌ర‌క‌ర్త‌, కురుబ‌ల ఆరాధ్య దైవం శ్రీ భ‌క్త దాస 538వ జ‌యంతి ఉత్స‌వాల‌ను నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున ప్ర‌జా ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా శ‌నివారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక తత్వవేత్త, స్వరకర్త, కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస 538వ జయంతి ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణ, హిందూపురం రోడ్డు, బైపాస్ సర్కిల్ లో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు.

బైపాస్ సర్కిల్‌కు శ్రీ భక్త కనకదాస సర్కిల్‌గా నామకరణం చేశారు మంత్రి . ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, ఎస్.సవిత, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీ నారాయణ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకట శివుడు, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, కందికుంట వెంకట ప్రసాద్, గుమ్మనూరు జయరాం, దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, బండారు శ్రావణిశ్రీ, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Related Posts

    ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు

    Spread the love

    Spread the loveఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వ‌ర్యంలో తిరుపతి : టీటీడీ ఆధ్వ‌ర్యంలో మార్చి 9న నిర్వ‌హించ‌నున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా…

    వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి

    Spread the love

    Spread the loveప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌కు అనుమ‌తి తిరుమల : తిరుమలలో కుమార ధార తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తీర్థానికి అనుమతించారు. శ్రీవారి సేవకుల సహకారంతో టీటీడీ అన్న ప్రసాద విభాగం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *