ఒక్క దుంగ కూడా మిస్ కాకూడ‌దు

స్ప‌ష్టం చేసిన ఏపీ ఉప ముఖ్య‌మంత్రి

తిరుప‌తి జిల్లా : రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న తిరుప‌తి జిల్లాలో రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం ఆక‌స్మిక త‌నిఖీల‌తో హొరెత్తించారు. శ‌నివారం జిల్లాలోని మంగ‌ళంలోని అట‌వీ శాఖ‌కు చెందిన ఎర్ర చంద‌నం గో డౌన్ల‌ను ప‌రిశీలించారు. మొత్తం ఎనిమిది గో డౌన్ల‌ను క‌లియ తిరిగారు. ఆయా గో డౌన్ల‌లో ఎప్ప‌టి నుంచి ఎర్ర చంద‌నం దుంగ‌లు ఉన్నాయ‌ని ప్ర‌శ్నించారు. అంతే కాకుండా గ‌త కొన్నేళ్లుగా ఎన్నెన్ని ఇక్క‌డ భ‌ద్ర ప‌రిచార‌ని ఆరా తీశారు. అంత‌కు ముందు గో డౌన్ల‌లో దుంగ‌ల‌కు సంబంధించిన రికార్డుల‌ను , ఫైళ్ల‌ను త‌నిఖీ చేశారు. మొత్తం దుంగ‌ల‌కు సంబంధించిన వివ‌రాల‌తో కూడిన రిపోర్టుల‌ను త‌న‌కు పంపించాల‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదే స‌మ‌యంలో ఏ ఒక్క‌రూ విధుల ప‌ట్ల అల‌సత్వం ప్ర‌ద‌ర్శించ వ‌ద్ద‌ని సూచించారు. ఇదే స‌మ‌యంలో ఒక్క దుంగ కూడా మిస్ కాకూడ‌ద‌ని, అలా జ‌రిగితే కఠిన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హెచ్చ‌రించారు. రాష్ట్ర స‌ర్కార్ పూర్తిగా నిఘా ఉంచింద‌ని, అత్యంత విలువైన ఎర్ర చంద‌నం దుంగ‌ల విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సంబంధిత అట‌వీశాఖ‌కు చెందిన ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *