రేవంత్ రెడ్డీ ప‌నికొచ్చే ప‌ని ఏదైనా చేశావా ..?

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మందిని తొక్క‌డం, మాట త‌ప్ప‌డం, మోసం చేయ‌డం రేవంత్ రెడ్డి క్యారెక్ట‌ర్ అంటూ ఫైర్ అయ్యారు. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఒక బాధ్య‌త క‌లిగిన ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి దిగ‌జారుడు మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు. త‌ను సీఎంన‌న్న సోయి లేకుండా మాట్లాడుతున్నాడ‌ని , దీనిని ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు. జూబ్లీహిల్స్ లో ఓడి పోతున్నాన‌న్న భ‌యం త‌న‌లో మొద‌లైంద‌న్నారు. వికృత చేష్టలు, విచిత్ర విన్యాసాలు తప్ప ప్రజలకు పనికొచ్చే ఒక్క పని ఇంత వ‌ర‌కు చేసిన పాపాన పోలేద‌న్నారు హ‌రీశ్ రావు.

డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ పేరును సచివాల‌యానికి పెడితే త‌ట్టుకోవ‌డం లేద‌న్నారు. ఆయ‌న పేరు ఉంద‌ని అక్క‌డికి వెళ్ల‌డం కూడా మానేశాడ‌ని, ఇక ఈయ‌న ఏం పాల‌న సాగిస్తాడ‌ని ప్ర‌శ్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి స‌వాల్ విసిరారు మాజీ మంత్రి . దొంగే దొంగ అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు అని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డిది ఫెవికాల్ బంధం అని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో క‌లిసి పోయాయ‌ని, ఆ విష‌యం చిన్న పిల్లాడిని అడిగినా చెబుతార‌న్నారు. ఓటుకు నోటు కేసులో ఈడీ కేసు ఉంటే ఎందుకు విచారణ జరగడం లేద‌ని ప్ర‌శ్నించారు. అస‌లు రేవంత్ రెడ్డిని ఎవ‌రు కాపాడుతున్నారో తెలియ‌దా అని ప్ర‌శ్నించారు.

  • Related Posts

    ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్

    ప్ర‌క‌టించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ టాప్ లో ఉంద‌న్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ…

    రైతుల‌ను బ‌లోపేతం చేయ‌డంలో నాబార్డ్ కృషి

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఈ దేశానికి వెన్నెముక‌గా రైతులు ఉన్నార‌ని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. రైతుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటూ వారిని మ‌రింత అభివృద్ది చేసేందుకు ప్ర‌య‌త్నం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *