జన్ సురాజ్ పార్టీ బీజేపీకి వ్య‌తిరేకం

ప్ర‌శాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్

బీహార్ : ప్ర‌ముఖ ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్, జ‌న్ సురాజ్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాము భార‌తీయ జ‌న‌తా పార్టీకి పూర్తిగా వ్య‌తిరేక‌మ‌ని అన్నారు. బీహార్‌లో కూటమిని తోసిపుచ్చారు ప్రశాంత్ కిషోర్ . తన పార్టీ సూత్రాలపై రాజీ పడటం కంటే ప్రజలతో కలిసి పని చేయడం కొనసాగించడానికి ఇష్టపడతానని స్ప‌ష్టం చేశారు . బిజెపి నేతృత్వంలోని కేంద్రం గుజరాత్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పూర్తి మెజారిటీని సాధించ లేకపోతే సంకీర్ణ ప్రభుత్వంలో చేరే అవకాశాన్ని జ‌న్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తోసిపుచ్చారు.

రాజకీయ వ్యూహకర్తగా మారిన రాజకీయ నాయకుడు తన పార్టీ సూత్రాలపై రాజీ పడటం అనేది ఉండ‌ద‌న్నారు. తాను , త‌న పార్టీ పూర్తిగా ప్ర‌జ‌ల కోసం ఏర్పాటైంద‌న్నారు. బీహార్ ప్రజలు ఇంకా మారకూడదనుకుంటే, మేము వారితోనే ఉండి మరో ఐదు సంవత్సరాలు పని చేస్తూనే ఉంటామన్నారు ప్ర‌శాంత్ కిషోర్. ప్రభుత్వంలో చేరే ప్రశ్న కూడా లేదన్నారు. జ‌న్ సురాజ్ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. లేక పోతే ప్ర‌తిపక్షంలో కూర్చుంటామ‌ని చెప్పారు. తాము బీజేపీకి పూర్తిగా వ్య‌తిరేక‌మ‌ని మ‌రోసారి కుండ బ‌ద్ద‌లు కొట్టారు. త‌మ‌కు ఎక్కువ సీట్లు రాక పోవ‌చ్చ‌ని అన్నారు. అయినా తాము బాధ ప‌డ‌మ‌న్నారు. చివ‌రి ర‌క్త‌పు బొట్టు వ‌ర‌కు ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తామ‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *