సుస్థిరాభివృద్దిలో భాగ‌స్వామ్యం ముఖ్యం

Spread the love

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

విశాఖ‌పట్నం : సుస్థిరాభివృద్ధిలో భారత్-యూరప్ దేశాల మధ్య సహకార భాగస్వామ్యం అత్యంత అవ‌స‌ర‌మ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గురువారం విశాఖ‌ప‌ట్నంలో CII భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సుస్థిరాభివృద్ధిలో భారత్-యూరప్ దేశాల మధ్య సహకార భాగస్వామ్యంపై ఈ సమావేశంలో ప్ర‌దానంగా చర్చించారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆర్మేనియా ఆర్థిక వ్యవహరాల మంత్రి గివార్గ్ పొపాయాన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, జర్మనీ, అర్మేనియా తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు, భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కళ్యాణి సహా వివిధ కంపెనీలకు చెందిన ఛైర్మన్లు, సీఈఓలు, సీఐఐ ప్రతినిధులు హజరయ్యారు. ఈసంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సును ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా పేరు పొందిన కంపెనీలు , ప్ర‌తినిధులు, చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్లు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లు, ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు కంపెనీల‌తో ఒప్పందాలు చేసుకుంది స‌ర్కార్.

  • Related Posts

    ఏపీని స‌ర్వ నాశ‌నం చేసిన జ‌గ‌న్ రెడ్డి

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై తీవ్ర స్తాయిలో మండిప‌డ్డారు. తాడేపల్లిలో 2…

    మాజీ ప్ర‌ధాని దేవెగౌడ ఆశీర్వాదం తీసుకున్న డీకేఎస్

    Spread the love

    Spread the loveరాజ‌కీయ ప‌రంగా ఆయ‌న అప‌ర చాణ‌క్యుడ‌ని కితాబు బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క నూత‌న ముఖ్య‌మంత్రిగా క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ బుధ‌వారం అనుకున్న స‌మ‌యానికి ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *