పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్ర‌ప్ర‌దేశ్

స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

విశాఖ‌ప‌ట్నం : పెట్టుబడులకు స్వర్గధామంగా విశాఖ మారిందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ప్రపంచ భాగస్వామ్యానికి నిదర్శనంగా ఈ సదస్సు నిలుస్తోందని చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీ, గ్రీన్‌ హైడ్రోజన్‌కు చిరునామాగా మారిందని పేర్కొన్నారు. “వన్ మిషన్, వన్ విజన్” అనే విధానంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తున్నాయని చెప్పారు. పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుతో పాటు, పారిశ్రామికవేత్తలను అతిపెద్ద మార్కెట్‌కు చేరువ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. అగ్రికల్చర్ నుంచి ఏరోస్పేస్ వరకు విభిన్న రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తుందని కేంద్ర మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ భరోసా ఇచ్చారు.

ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు వంటి దార్శనిక నాయకుల నేతృత్వంలో భారతదేశం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గత కొన్ని నెలలుగా ఏపీలో కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7 ఆపరేషనల్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. త్వరలో కొత్తగా మరో 7 ఎయిర్‌పోర్టులను నిర్మిస్తామని చెప్పారు. భ‌విష్య‌త్తులో పెద్ద ఎత్తున ఏపీలో ఉద్యోగాల క‌ల్ప‌న జ‌ర‌గ‌నుంద‌ని పేర్కొన్నారు.

  • Related Posts

    విద్య‌తోనే వికాసం అభివృద్దికి సోపానం

    స్ప‌ష్టం చేసిన నారా భువ‌నేశ్వ‌రి అమ‌రావ‌తి : జీవితాన్ని ప్ర‌భావితం చేసేది ఒక్క‌టేన‌ని అది విద్య అని గుర్తించాల‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి. చ‌దువుతోనే మ‌నిషిలో సంస్కారం అల‌వ‌డుతుంద‌ని అన్నారు. విద్య‌తోనే వికాసం అల‌వ‌డుతుంద‌ని,…

    రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం

    స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు అత్యంత స‌హ‌జ‌మ‌ని , కార్య‌క‌ర్త‌లు, నేత‌లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా జ‌రిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో అధికార పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *