జ‌ల‌హార‌తిలో పాల్గొన్న నారా భువ‌నేశ్వ‌రి

పాల్గొన‌డం ఆనందంగా ఉంద‌న్నారు

చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి, హెరిటేజ్ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం చిత్తూరు జిల్లాలోని కుప్పం శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఆమె ఆయా గ్రామాల‌లో తిరిగారు. అక్క‌డి ప్ర‌జ‌ల‌ను క‌లుసుకున్నారు. అంతే కాకుండా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న క‌స్తూర్బాగాంధీ పాఠ‌శాల‌ల‌ను సంద‌ర్శించారు. అక్క‌డే ఉంటూ చ‌దువుకుంటున్న పేద విద్యార్థినుల‌తో క‌లిసి భోజ‌నం చేశారు. వారికి ధైర్యం చెప్పారు. చ‌దువు కోవాల‌ని, విద్య ఒక్క‌టే మ‌న‌కు గౌర‌వాన్ని తీసుకు వ‌స్తుంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ఇవాళ కుప్పం నియోజకవర్గంలో.ఇ తుమ్మిసి పెద్ద చెరువులో జలహారతి కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు నారా భువ‌నేశ్వ‌రి. కుప్పంతో పాటు రాష్ట్రంలో ఉన్న రైతులకు సాగునీరు ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. వ్య‌వ‌సాయం కీల‌క‌మైన రంగ‌మ‌ని, రైతులు బాగుంటేనే మ‌నం బాగుంటామ‌ని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల‌కు మేలు చేకూర్చేలా కూట‌మి స‌ర్కార్ ప‌ని చేస్తోంద‌ని అన్నారు నారా భువ‌నేశ్వ‌రి.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *