newsseals.com
News

దేశం గ‌ర్వించ ద‌గిన నాయ‌కుడు వాజ్‌పేయి

VijayaBhaskar November 30, 2025
newsseals-PVNMadhav
Spread the love

ప్ర‌శంసించిన బీజేపీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్

అమ‌రావ‌తి : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన మహోన్న‌త మాన‌వుడు దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి అట‌ల్ బిహారీ వాజ్ పేయి అని అన్నారు ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్. ఆదివారం కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేటలో భారత రత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన దూరదృష్టి, ప్రజాస్వామ్య విలువల పట్ల అచంచల నిబద్ధత, మాటలో మాధుర్యంం , వాజ్‌పేయిని గొప్ప నాయ‌కుడిగా నిల‌బెట్టేలా చేశాయ‌న్నారు.

ఆయన సేవా తపస్సును స్మరించుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్న సంకల్పం పునరుద్ఘాటించామ‌ని అన్నారు పీవీఎన్ మాధ‌వ్. ఆయ‌న అందించిన సేవ‌లు ఎప్ప‌టికీ , ఎల్ల‌ప్ప‌టికీ నిలిచే ఉంటాయ‌న్నారు. ఈ దేశంలో కీల‌క‌మైన ర‌హ‌దారుల నిర్మాణానికి శ్రీ‌కారం చుట్టింది త‌న హ‌యాంలోనేన‌ని గుర్తు చేశారు పీవీఎన్ మాధ‌వ్. ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌మండ్రి ఎంపీ పురందేశ్వ‌రి, ఎమ్మెల్యే న‌ల్ల‌మ‌ల్లి రామ‌కృష్ణా రెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ తో పాటు బిజెపి నాయకులు పాల్గొన్నారు.