ప్రకటించిన పార్టీ కో ఆర్డినేటర్
చెన్నై : దళపతి విజయ్ సారథ్యంలోని టీవీకే పార్టీ తమిళనాడులోని పెరుందురైలో తదుపరి ప్రచారం చేపడతారని పార్టీ సమన్వయకర్త శుక్రవారం వెల్లడించారు. ఈ సమావేశం నవంబర్ 27న టీవీకేలో చేరిన కె ఎ సెంగొట్టయన్ నిర్వహించే మొదటి కార్యక్రమం అవుతుంది. తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ తదుపరి ప్రచార సమావేశం ఈనెల 18న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట మధ్య ఉంటుందని తెలిపారు. ఈరోడ్ జిల్లాలోని పెరుందురైలో జరుగుతుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఇటీవల పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ లో తొక్కిసలాట చోటు చేసుకుని భారీ ఎత్తున ప్రాణ నష్టం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. తాజాగా కోర్టు ఆదేశాల మేరకు విజయ్ తిరిగి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
ఇప్పటికే తన పర్యటనకు సంబంధించి పోలీసులు కీలక సూచనలు చేశారు. అంతే కాదు పలు నిబంధనలు విధించారని చెప్పారు టీవీకే కోఆర్డినేటర్. ఇదిలా ఉండగా పోలీసులు నిర్దేశించిన 84 షరతులన్నింటినీ నెరవేర్చిందని టీవీకే ఉన్నత స్థాయి పరిపాలనా కమిటీ పేర్కొంది. విజయ మంగళం టోల్ గేట్ సమీపంలో, జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న సమావేశ స్థలాన్ని సందర్శించిన తర్వాత, సమావేశం ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్వహించ బడుతుందని సెంగొట్టయన్ మీడియాతో అన్నారు. ఒకే స్థలంలో అనేక రాజకీయ సమావేశాలు జరిగినందున, షరతులు విధించిన తర్వాత పోలీసులు సమావేశాన్ని క్లియర్ చేశారని చెప్పారు. స్థలం ఉన్న 10 ఎకరాల స్థలంలో ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు.






