ఈడీ నోటీస్ పై డీకే శివ‌కుమార్ షాకింగ్ కామెంట్స్

త‌న‌కు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు

ఢిల్లీ : త‌న‌కు ఈడీ మ‌రోసారి నోటీసు ఇవ్వ‌డం, ఢిల్లీలో ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాడు క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. సోమ‌వారం ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు.
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. తాను మల్లికార్జున్ ఖర్గే, వేణుగోపాల్‌ను కలవాల్సి ఉందన్నారు. అలాగే రాహుల్ గాంధీ , సోనియా గాంధీని కలిశానని చెప్పారు డీకే శివ‌కుమార్. ఈరోజు తాను దావ‌ణ‌గెరె వెళ్లాల్సి ఉంద‌ని, అక్క‌డ ఉన్న ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున్ ఖర్గే ను కల‌వాల్సి ఉంద‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం వాతావ‌ర‌ణం అనుకూలించ‌డం లేద‌ని, అందుకే కొంత ఆల‌స్యం అవుతోంద‌ని అన్నారు డీకే శివ‌కుమార్. ఇదే స‌మ‌యంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ నోటీసు ఇవ్వడంపై స్పందించారు. ఇదే స‌మ‌యంలో ఢిల్లీ పోలీసు నోటీసు ఇవ్వ‌డాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఇది అత్యవసరం కాబట్టి నేను ఈరోజు వెళ్లాల్సి ఉంది. నేను వచ్చే వారం వరకు సమయం అడుగుతున్నాన‌ని అన్నారు. నేను ఈడీకి అన్ని సమాధానాలు ఇచ్చానని చెప్పారు డీకే శివ‌కుమార్. కాబట్టి నాకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా కావాలి, దాని కోసం అడుగుతున్నానని తెలిపారు. అందులో ఏముందో నాకు తెలియదు కాబట్టి నేను ఎఫ్ఐఆర్ కాపీని అడ‌గాల్సి వ‌చ్చింద‌న్నారు. వచ్చే వారం అసెంబ్లీ సమావేశాల తర్వాత, నేను వచ్చి నాకు ఇచ్చిన నోటీసుకు స్పందిస్తానని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *