శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు

Spread the love

డిసెంబ‌ర్ 16 నుంచి జ‌న‌వ‌రి 15 వ‌ర‌కు

చిత్తూరు జిల్లా : శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం లో మంగ‌ళ‌వారం నుంచి వ‌చ్చే జ‌న‌వ‌రి 15 వ‌ర‌కు విశిష్ట పూజ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆల‌య క‌మిటీ పేర్కొంది. మంగళవారం నుండి 15న గురువారం వరకు ధనుర్మాసము, జ‌న‌వ‌రి 3న ఆరుద్ర అభిషేకము, నటరాజస్వామి పుర వీధుల ఉత్సవం, రాత్రి ఆరికట్ల ఉత్సవాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపింది. ప్ర‌తి రోజూ ఉదయం 3.00 గంటలకు పురవీధులలో జేగంట పంపుట .4.00 గంటలకు ఆలయ మంగళ వాయిద్యములు , 4.15 గంటలకు గోపూజ, తిరుమంజనం , 4.30 గంటలకు పల్లియర పూజ (సుప్రభాతం లేదు) తేవారము ఉంది (తిరువైoబావై), 5.00 గంటలకు సర్వ దర్శనం, 5.00 గంటలకు మొదటి కాల అభిషేకం (సేవలు లేవు), 6.00 గంటలకు రెండవ కాల అభిషేకం, 7.00 గంటలకు పరివార నైవేద్యం ,7.30 గంటలకు గొబ్బెమ్మ వార్ల ఉత్సవం, 10.30 గంటలకు మూడవ కాల అభిషేకం (ఉచ్చికాలము) ఉంటుంద‌ని తెలిపింది.

సాయంత్రం 5.00 గంటలకు ప్రదోష కాలాభిషేకం , శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఈ నాలుగు రోజులలో రాత్రి 9.00 గంటలకు పల్లియర పూజ ఉంటుంది. మంగ‌ళ‌వారం, బుధ‌వారం, గురువారం ఈ మూడు రోజుల‌లో రాత్రి 8:30 గంటలకు పల్లియర పూజ. 3న శ‌నివారం ఆరుద్ర అభిషేకం,
ఉదయం 3.00 గంటలకు పురవీధులలో జేగంట పంపుట , 3.30 గంటలకు ఆలయ మంగళ వాయిద్యములు, 4.00 గంటలకు గోపూజ+ తిరుమంజనము, సుప్రభాతము (తిరువైoబావై) , 4.30 గంటలకు ప్రధమ కాల అభిషేకం, 5.30 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయం నందు సంకల్పం, 6.00 గంటలకు లింగోద్భవ కాల, పిష్టి లింగ అభిషేకము (స్వామి వారికి మాత్రమే) , 7.00 గంటలకు నటరాజ స్వామి వార్లకు అభిషేకం, 7.30 గంటలకు పరివార దేవతలకు నైవేద్యం , 9.00 గంటలకు శ్రీ నటరాజ స్వామి వార్ల గ్రామోత్సవం, 10.10 గంటలకు పురవీధులలో గొబ్బి ఉత్సవం , 10.30 గంటలకు ద్వితీయ కాల ఉష్ణోదక అభిషేకం, మధ్యాహ్నం 1.30 గంటలకు తృతీయ (మూడవ) కాల అభిషేకం, సాయంత్రము 5.00 గంటలకు ప్రదోషకాల అభిషేకం, రాత్రి 8 గంటలకు ఆరికట్ల ఉత్సవం , 9.30 గంటలకు శ్రీ స్వామి అమ్మవార్ల పురవీధుల ఉత్సవం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు ఆల‌య ఈవో.

  • Related Posts

    తిరుమ‌ల‌లో సామాన్య భ‌క్తుల‌కే పెద్ద‌పీట‌

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : తిరుమ‌ల‌లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఆయ‌న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో క‌లిసి మీడియాతో…

    సింహాచ‌లం అప్ప‌న్న స‌న్నిధిలో శ్రీ‌లీల‌

    Spread the love

    Spread the loveప్ర‌త్యేక పూజ‌లు చేసిన న‌టిమ‌ణి , త‌ల్లి కూడా విశాఖ‌ప‌ట్నం జిల్లా : ప్ర‌ముఖ న‌టి శ్రీ‌లీల సంద‌డి చేశారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతోంది విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని పేరు పొందిన సింహాచ‌లం ఆల‌యం. ఇక్క‌డ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *