టీటీడీకి రూ.1.20 కోట్లు విలువైన బ్లేడ్లు విరాళం

Spread the love

ప్ర‌శంస‌లు కురిపించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు

తిరుమల : హైదరాబాద్ కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి టీటీడీకి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లలను విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు బ్లేడ్లను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భక్తులు తలనీలాలు సమర్పించేందుకు బ్లేడ్ల కోసం టీటీడీ ఏడాదికి రూ.1.16 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రోజుకు 40 వేల హాఫ్ బ్లేడ్లను కల్యాణకట్టల్లో వినియోగిస్తున్నామని తెలిపారు. ఒక ఏడాదికి టీటీడీకి సరిపడా బ్లేడ్లను విరాళం ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని దాతను చైర్మన్ అభినందించారు.

ఈ సందర్భంగా దాత శ్రీధర్ బోడుపల్లి మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా హాఫ్ బ్లేడ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ తమదేనని అన్నారు. ఈ హాఫ్ బ్లేడ్ల వల్ల కల్యాణకట్టలో భక్తులకు తలనీలాలు తీసేందుకు క్షురకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ సంస్థ తయారు చేసిన బ్లేడ్లకు యూరప్, అమెరికాతో సహా 52 దేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. 7′ఓ క్లాక్ సంస్థ బ్లేడ్లను కూడా తామే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్యాణకట్ట ఏఈఓ రమాకాంత్ పాల్గొన్నారు.

  • Related Posts

    శ్రీవారి వైభవ రూపకర్త సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి

    Spread the love

    Spread the loveతిరుప‌తిలో ఘ‌నంగా 137వ జ‌యంతి తిరుపతి : తిరుమలలోని శాసనాలను అనువదించి శ్రీ వేంకటేశ్వర స్వామివారి వైభవం విశ్వ వ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు శ్రీమాన్‌ సాధు సుబ్రహ్మణ్యశాస్త్రి అని అద్దెంకి ప్ర‌భుత్వ క‌ళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్…

    అత్యాధునిక వ‌స‌తుల‌తో స్విమ్స్ అభివృద్ది

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : దేశంలో ఎక్క‌డా లేని విధంగా అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాల‌తో స్విమ్స్ ను అభివృద్ది చేస్తామ‌ని ప్ర‌క‌టించారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. స్విమ్స్ మెయిన్ బిల్డింగ్లో పునరుద్ధరణ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *