తిరుమ‌ల‌లో ఘ‌నంగా అధ్యయనోత్సవాలు

Spread the love

25 రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఉత్స‌వాలు

తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 25 రోజుల పాటు జ‌రుగ‌నున్న అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఇందులో భాగంగా రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు రంగ నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాలు నిర్వహించారు.ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుండి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది.

ఈ సందర్భంగా స్వామివారి ప్రాశస్త్యంపై 12 మంది ఆళ్వార్లు రచించిన దివ్య ప్రబంధ పాశురాలను శ్రీవైష్ణవ జియ్యంగార్లు గోష్ఠిగానం చేస్తారు. కాగా ఈ కార్య‌క్ర‌మంలో తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్‌ స్వామి, తిరుమల శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న జీయ‌ర్‌ స్వామి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది టీటీడీ.

  • Related Posts

    జ‌స్టిస్ గ‌వాయ్ నియామ‌కాన్ని స్వాగ‌తిస్తున్నాం

    Spread the love

    Spread the loveచిలుకూరు బాలాజీ ప్ర‌ధాన పూజారి రంగ‌రాజ‌న్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని ప్ర‌ముఖ న్యాయ విశ్వ విద్యాల‌యం భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ కి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది.…

    డిసెంబర్ 21న తిరుమలలో పల్స్ పోలియో

    Spread the love

    Spread the loveవెల్ల‌డించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుమల : దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా తిరుమలలో డిసెంబర్ 21వ తేదీ పల్స్ పోలియో కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమం డిసెంబర్ 21న ఉదయం 7…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *