శేషాచ‌లం అడ‌వుల్లో ఔష‌ధ వ‌నం ఏర్పాటు

Spread the love

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌క‌ట‌న

తిరుమ‌ల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు శేషాచ‌లం అడ‌వుల్లో దివ్య ఔష‌ధ వ‌నం ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసింది. ఈ మేర‌కు టీటీడీ పాల‌క మండ‌లి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించింది టీటీడీ. టీటీడీ ఏర్పాటు చేయనున్న దివ్య ఔషధ వనంలో దేహ చికిత్స వనం, సుగంధ వనం, పవిత్ర వనం, ప్రసాద వనం, పూజా ద్రవ్య వనం, జీవరాశి వనం, కల్పవృక్ష ధామం, ఔషధ కుండ్, ములికా వనం, ఋతు వనం, విశిష్ట వృక్ష వనం, ఔషధ మొక్కలు వంటి 13 రకాల ప్రత్యేక థీమ్ ఆధారిత విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. ఇవి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడమే కాకుండా, ఔషధ విజ్ఞానం, ప్రకృతిపై అవగాహనను పెంపొందించనున్నాయి.

తిరుమలలోని జీఎన్సీ టోల్ గేట్ కు సమీపంలో దిగువ, ఎగువ ఘాట్ రోడ్లకు మధ్యలో ఉన్న 3.90 ఎకరాల స్థలంలో ఈ దివ్య ఔషధ వనం అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వచ్చే నెలలో పనులు ప్రారంభించి మొక్కలను పెంచి, భక్తుల సందర్శనకు వీలుగా పార్కింగ్, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తిస్థాయిలో ఔషధ వనాన్ని అందుబాటులోకి తీసుకు రానున్నారు. రూ.4.25 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు టీటీడీ ఆమోదం తెలప‌డం విశేషం.

  • Related Posts

    అస్సాం స‌ర్కార్ కు టీటీడీ చైర్మ‌న్ కంగ్రాట్స్

    Spread the love

    Spread the loveశ్రీ‌వారి ఆలయ నిర్మాణానికి 25 ఎక‌రాలు తిరుమ‌ల : అస్సాం స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టీటీడీ చైర్మ‌న్ తో పాటు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అభ్య‌ర్థ‌న మేర‌కు 10 ఎక‌రాల‌కు బ‌దులు 25 ఎక‌రాలు…

    మ‌ద్యం సేవించి వాహ‌నాలు న‌డిప‌తే చ‌ర్య‌లు

    Spread the love

    Spread the loveహెచ్చ‌రించిన తిరుప‌తి ఎస్పీ సుబ్బారాయుడు తిరుప‌తి : మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండద‌ని స్ప‌ష్టం చేశారు తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌నా భ‌వ‌నంలో పోలీసుల‌కు టీటీడీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *