ధురంద‌ర్ సినిమా బాగుంద‌న్న శ్రుతి హాస‌న్

Spread the love

సోష‌ల్ మీడియా ట్రెండ్స్ పై షాకింగ్ కామెంట్స్

చెన్నై : ప్ర‌ముఖ న‌టి , ఇళ‌య నాయ‌గ‌న్, ఎంపీ క‌మ‌ల్ హాస‌న్ త‌న‌యురాలు శ్రుతి హాస‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. బుధ‌వారం త‌ను సామాజిక వేదిక ఎక్స్ లో త‌న అభిప్రాయాల‌ను పంచుకుంది. ఇదే స‌మ‌యంలో తాజాగా ఓ ఛాన‌ల్ తో త‌ను ముచ్చ‌టించింది. ‘హే రామ్’ సినిమా గురించి ఇప్పుడు అందరూ ‘వావ్, కల్ట్ క్లాసిక్’ అంటున్నారని, కానీ అది విడుదలైనప్పుడు, దానికి దక్కాల్సిన ఆదరణ ఎవరూ ఇవ్వలేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 20 సంవత్సరాల తర్వాత, దానికి ఇప్పుడు చివరికి గుర్తింపు లభిస్తోందన్నారు శ్రుతి హాస‌న్.

తాను చేసిన ‘విన్వెలి నాయగ్, ‘సంచారి’ రీల్స్‌కు చాలా వ్యూస్ వస్తాయి , కానీ నేను నా ఆత్మను, సర్వస్వాన్ని పెట్టి రాసి, పాడిన ఆంగ్ల పాటకు కేవలం 30,000 వ్యూస్ మాత్రమే ఎలా వ‌స్తాయో అర్థం కావ‌డం లేదంటూ వాపోయింది. సంగీతకారులకు నంబర్ మీటర్ లేనందుకు దేవుడికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని తెలిపారు. ఈ రోజుల్లో నటీనటులపై రూ.1000 కోట్ల మీటర్ ఒత్తిడి ఉందని, అది చివరికి సినిమాను నాశనం చేస్తుంద‌ని ఆవేద‌న చెందారు శ్రుతి హాస‌న్. ఇక త‌న వ‌ర‌కు వ‌స్తే ఈ ఏడాదిలో త‌న‌ను ఎక్కువ‌గా ఆక‌ర్షించిన మూవీ ఒక్క‌టేనని, అది ర‌ణ్ వీర్ సింగ్ , అక్ష‌య్ ఖ‌న్నా క‌లిసి న‌టించిన ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ధురంధ‌ర్ అని అన్నారు.

  • Related Posts

    సీఎం జోసెఫ్ విజ‌య్ డ్యాన్స్ వీడియో వైర‌ల్

    Spread the love

    Spread the loveత్వ‌ర‌లో రిలీజ్ కానున్న జ‌న నాయ‌గ‌న్ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రానికి నూత‌న సీఎంగా ఎన్నికైన ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ చంద్ర‌శేఖర్ ఇప్పుడు వైర‌ల్ గా మారారు. త‌ను చివ‌రిసారిగా న‌టించిన జ‌న నాయ‌గ‌న్ చిత్రంలో భాగంగా సింగ‌పూర్…

    త‌మిళ‌నాడు భూమి పుత్రుడు జోసెఫ్ విజ‌య్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన న‌టి స‌న‌మ్ శెట్టి చెన్నై: జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంద‌ర్బంగా సినీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. తమిళ నటి సనమ్ శెట్టి ఇలా అన్నారు. ఈ రోజు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *