చెంచుల‌పై ఆంక్ష‌లు ఎత్తి వేయాలి

ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియా రెడ్డి

అమ‌రావ‌తి : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మ‌ర్యాద పూర్వ‌కంగా ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడును క‌లిశారు. ఈసంద‌ర్బంగా త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ఆమె ఏక‌రువు పెట్టారు. ప్ర‌ధానంగా వెదురు ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చెంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను తొల‌గించాల‌ని కోరారు. ప్ర‌ధానంగా ఫారెస్ట్ అధికారులు విధించిన ఆంక్షలు నిజంగా బాధాకరమైనవని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారు రెండు రోజులుగా చేస్తున్న నిరసన నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడుని కలిసి వారి ఆవేదనను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు భూమా అఖిల‌ప్రియ‌.

ఈ అంశంపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. సంబంధిత ఫారెస్ట్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వం సహకారంతో ఈ సమస్యకు సమగ్ర పరిష్కారం చూపించి, చెంచులకు పూర్తి స్థాయిలో అండగా ఉంటానని భరోసా ఇవ్వ‌డం పట్ల సంతోషం వ్య‌క్తం చేశారు ఎమ్మెల్యే. త‌మ కూట‌మి స‌ర్కార్ ఎవ‌రినీ ఇబ్బందుల‌కు గురి చేయ‌దని స్ప‌ష్టం చేశారు. జీవ‌నోపాధి క‌ల్పిస్తుందే త‌ప్పా పొట్ట కొట్ట‌ద‌న్నారు భూమా అఖిల‌ప్రియ‌.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *