ప్రధాన న్యాయమూర్తికి న్యూ ఇయర్ విషెస్
హైదరాబాద్ : 2026 నూతన సంవత్సరం సందర్బంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ జిష్ను దేవ్ వర్మతో పాటు రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా గవర్నర్ కు, సీజేకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు సీఎం. అంతకు ముందు ఎ. రేవంత్ రెడ్డిని పలువురు ప్రముఖులు కలిశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) మహేష్ ఎం. భగవత్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (హోం) సి.వి. ఆనంద్, సీనియర్ ఐపీఎస్ అధికారులు శిఖా గోయల్, సౌమ్య మిశ్రా, హెచ్వైడీఆర్ఏఏ కమిషనర్ ఎ.వి. రంగనాథ్ కూడా ఉన్నారు.
ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, డీజీపీ బి. శివధర్ రెడ్డితో సహా ఇతర సీనియర్ అధికారులు ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, ఆయన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ను ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.






