తెలంగాణ స‌ర్కార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

పిటిష‌న్ కు విచార‌ణ అర్హ‌త లేద‌న్న ధ‌ర్మాస‌నం

న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది తెలంగాణ దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై. పోలవరం నల్లమల్ల సాగర్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువ‌రించింది ధ‌ర్మాస‌నం. ఈ సంద‌ర్బంగా బిగ్ షాక్ ఇచ్చింది. తెలంగాణ ప్ర‌భుత్వం దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ సీరియ‌స్ గా వ్యాఖ్యానించింది. అయితే పిటిష‌న్ దాఖ‌లు చేసే ముందు ముందూ వెనుకా ఆలోచించ‌క పోవ‌డం విడ్డూరంగా ఉంద‌ని పేర్కొంది. చివ‌ర‌కు పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది సింఘ్వీ చేసిన వినతి మేర‌కు ఇత‌ర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం పొందేందుకు అనుమతి ఇచ్చేందుకు ఓకే చెప్పింది.

ధ‌ర్మాస‌నం చేసిన వ్యాఖ్య‌ల‌తో తాము పిటిషన్ ఉపసంహరించు కుంటున్నామని తెలిపారు తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి. దీంతో రిట్ పిటిషన్ ఉపసంహరించుకుంది. సివిల్ సూట్ ఫైల్ చేస్తామని సుప్రీంకోర్టుకు తెలిపారు. గోదావరి నది జలాల విషయంలో మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల వాదనలు కూడా వినాల్సి ఉందని పేర్కొంది సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం. నీటి కేటాయింపుల ఉల్లంఘనలపై అన్ని రాష్ట్రాల వాదనలు వినేందుకు సివిల్ సూట్ ఫైల్ చేయాలని ఆదేశించింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *