త్రిషా కృష్ణ‌న్, న‌య‌న‌తార హ‌ల్ చ‌ల్

Spread the love

సోష‌ల్ మీడియాలో హీరోయిన్లు వైర‌ల్

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ హీరోయిన్లుగా గుర్తింపు పొందారు త్రిషా కృష్ణ‌న్, న‌య‌న‌తార‌. ఈ ఇద్ద‌రూ మంచి స్నేహితురాళ్లుగా ఉన్నారు. ఇద్ద‌రూ త‌మ త‌మ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఇదే స‌మ‌యంలో ఎవ‌రికి వారే వెరీ వెరీ స్పెష‌ల్. సినీ ఇండ‌స్ట్రీలో అతి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్ద‌రూ పోటీ ప‌డుతూ న‌టిస్తూ వ‌చ్చారు. త‌మ త‌మ స్థానాల‌లో కొలువు తీరారు. ఏ పాత్ర ఇచ్చినా స‌రే వాటికి న్యాయం చేస్తూ వ‌చ్చారు. ఎక్క‌డా రాజీ ప‌డ‌రు. వారి న‌డ‌క‌లో, న‌ట‌న‌లో, మాట‌లలో ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. అందుకే వారికి అంత ప్ర‌యారిటీ . సినిమాల రేంజ్ విష‌యానికి వ‌స్తే భారీ రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్నారు.

ఓ వైపు కొన్ని సినిమాల‌కు మాత్ర‌మే ప‌రిమితం అవుతే, ఇంకొంద‌రు ఒకే ఒక్క సినిమాలో ద‌ర్శ‌నం ఇచ్చి ఆ త‌ర్వాత క‌నుమ‌రుగై పోతున్నారు. కానీ త్రిషా కృష్ణ‌న్, న‌య‌న‌తారలు మాత్రం అన్ స్టాప‌బుల్ అంటూ ముందుకు సాగుతుండ‌డం విశేషం. ఇదే క్ర‌మంలో ఈ ఇద్ద‌రూ తాజాగా క‌లిసి క‌నిపించారు. బోటులో సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. సామాజిక మాధ్య‌మాల‌లో వైర‌ల్ అవుతున్నాయి. త‌మ ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి విభేదాలు లేవ‌ని, తాము క‌లిసి ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ‌పై నోరు పారేసుకుంటున్న వారికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు.

  • Related Posts

    సీఎం జోసెఫ్ విజ‌య్ డ్యాన్స్ వీడియో వైర‌ల్

    Spread the love

    Spread the loveత్వ‌ర‌లో రిలీజ్ కానున్న జ‌న నాయ‌గ‌న్ చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్రానికి నూత‌న సీఎంగా ఎన్నికైన ప్ర‌ముఖ న‌టుడు విజ‌య్ చంద్ర‌శేఖర్ ఇప్పుడు వైర‌ల్ గా మారారు. త‌ను చివ‌రిసారిగా న‌టించిన జ‌న నాయ‌గ‌న్ చిత్రంలో భాగంగా సింగ‌పూర్…

    త‌మిళ‌నాడు భూమి పుత్రుడు జోసెఫ్ విజ‌య్

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన న‌టి స‌న‌మ్ శెట్టి చెన్నై: జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంద‌ర్బంగా సినీ ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. తమిళ నటి సనమ్ శెట్టి ఇలా అన్నారు. ఈ రోజు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *