newsseals.com
News

దివ్యాంగుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు

VijayaBhaskar January 27, 2026
newsseals-BhattiVikramarka
Spread the love

కేటాయించామ‌న్న మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క

ఖ‌మ్మం జిల్లా : డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ స‌ర్కార్ దివ్యాంగుల సంక్షేమం కోసం భారీ ఎత్తున నిధుల‌ను కేటాయించింద‌ని చెప్పారు. ఖ‌మ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే దివ్యాంగుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేయడం జరిగింద‌ని అన్నారు డిప్యూటీ సీఎం.

దివ్యాంగ విద్యార్థులకు ఐప్యాడ్లు, ల్యాప్‌టాప్‌లు అందిస్తూ వారి ఉన్నత చదువులకు ప్రభుత్వం భరోసానిస్తోందని అన్నారు. అంగవైకల్యం అనేది ఎదిగేందుకు అడ్డంకి కాకూడదని, వారిని సమాజంలో మనతో సమానంగా గౌరవప్రదమైన స్థితిలోకి తీసుకు రావడమే మా లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. దివ్యాంగులకు అన్ని రకాల సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూస్తూ, ప్రతి అడుగులోనూ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్నారు. ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కార్ ప‌ని చేస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే ప‌లు సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంద‌ని చెప్పారు.