newsseals.com
News

అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ కోసం భారీ ఏర్పాట్లు

VijayaBhaskar January 29, 2026
newsseals-AnithaVnagalapudi
Spread the love

ప‌రిశీలించిన అనిత వంగ‌ల‌పూడి

విశాఖ‌ప‌ట్నం జిల్లా : రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంగానికి స‌ర్కార్ ప్ర‌యారిటీ ఇస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే సాంస్కృతిక ఉత్స‌వాల‌కు పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింద‌ని చెప్పారు. ఇందులో భాగంగా గురువారం అన‌కాప‌ల్లిని సంద‌ర్శించారు మంత్రి.
ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న అనకాపల్లి ఉత్సవ్ ఏర్పాట్లను పరిశీలించారు. ముత్యాలమ్మ పాలెం తీరంలో కలెక్టర్ విజయకృష్ణన్ , ఎస్పీ తుహీన్ సిన్హా , ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేశ్ తో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. అధికారులకు తగిన సూచనలు చేశారు.

ముత్యాలమ్మ పాలెం తీరంతో పాటు కొండకర్ల ఆవలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. భారీ ఎత్తున ప్రజలు హాజరు కానున్నందున ఏర్పాట్లలో లోపాలు లేకుండా ఉండాల‌ని ఆదేశించారు. ఏ ఒక్క చిన్న త‌ప్పు జ‌రిగినా అది ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు వ‌స్తుంద‌ని పేర్కొన్నారు వంగ‌ల‌పూడి అనిత‌. అనకాపల్లి ప్రతిష్టను పెంచేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఏర్పాట్ల కోసం భారీ ఎత్తున నిధులు కూడా మంజూరు చేసింద‌ని వెల్ల‌డించారు.