రామ‌కృష్ణ మిష‌న్ ఆధ్వ‌ర్యంలో యువ స‌మ్మేళ‌నం

Spread the love

ఫిబ్ర‌వ‌రి 1న వివేకానంద మానవ వికాస కేంద్రం సిద్దం
విజ‌య‌వాడ : రామ‌కృష్ణ మిష‌న్ ఆధ్వ‌ర్యంలో భారీ ఖ‌ర్చుతో విజ‌య‌వాడ‌లో అత్యాధునిక వ‌స‌తి సౌక‌ర్యాల‌తో వివేకానంద మాన‌వ వికాస కేంద్రం నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 1న మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ప్రారంభిస్తార‌ని మిష‌న్ ప్ర‌తినిధి వెల్ల‌డించారు. ఉదయం 9 గం.లకు వివేకానంద మానవ వికాస భవన ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం ఉదయం 10గం.లకు జ్యోతి ప్రజ్వలన, మూర్తి త్రయానికి పుష్పాంజలి, వేద మంత్ర పఠనం, ప్రారంభ గీతంతో మొదలవుతుందన్నారు. అనంతరం సమావేశ కార్యక్రమాలన్నీ తుమ్మలపల్లి కళాక్షేత్రములో నిర్వహించనున్నట్లు స్వామీజీ తెలిపారు. అనంతరం పరమపూజ్య శ్రీమత్ స్వామి గౌతమానందజీ మహరాజ్ అనుగ్రహ భాషణం, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందేశం, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ప్రసంగం, పూజ్య స్వామి వినిశ్చిలానంద, స్వామి శశికాంత నంద, స్వామి హృదానంద, స్వామి శితికంఠానంద ప్రసంగాలతో కార్యక్రమం జరగనుందన్నారు.

మధ్యాహ్నం 2గం.లకు స‌యువ సమ్మేళనం’లో పాల్గొనే అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని రామకృష్ణ మిషన్ వెల్లడించింది. ఉపాధ్యాయులకు శిక్షణకు సంబంధించిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. వివేకానంద యువ సమ్మేళనంలో హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద, కర్ణాటక గదగ్ రామకృష్ణ వివేకానంద ఆశ్రమ అధ్యక్షులు స్వామి నిర్భయానంద, కర్ణాటక తుంకూరు రామకృష్ణ వివేకానంద ఆశ్రమ అధ్యక్షులు స్వామి వీరేశానంద, కడప రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి అనుపమానంద ప్రసంగం, యువత ప్రశ్నలు- జవాబుల కార్యక్రమం ఉంటుందన్నారు.

సాయంత్రం 4.45 గం.లకు ప్రారంభమయ్యే స్వామి రంగనాథానంద స్మృతి సభలో విజయవాడ రామకృష్ణ మిషన్ పాఠశాల విద్యార్థులచే భజనలు, లఘునాటిక ప్రదర్శనలు, శాస్త్రీయ నృత్యం, కోలాటం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు. శ్రీ పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా.చదలవాడ సుధ, డా.చదలవాడ నాగేశ్వరరావు ప్రసంగం, ఢిల్లీ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సర్వలోకానందజీ, చెన్నై రామకృష్ణ మఠం మేనేజర్ స్వామి రఘునాయకానంద ప్రసంగాలు ఉంటాయన్నారు. ఈ సన్నాహక ప్రెస్ మీట్ కార్యక్రమంలో జ్ఞానార్కనంద స్వామీజీ , రామకృష్ణ మిషన్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు సుధాకర్ పాల్గొన్నారు.

  • Related Posts

    మే 01 నుండి శ్రీ వేద నారాయ‌ణ స్వామి బ్ర‌హ్మ‌త్స‌వాలు

    Spread the love

    Spread the loveఘ‌నంగా ఏర్పాట్లు చేసిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుప‌తి : నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1 నుండి 9వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ…

    టీటీడీ ప్రాణ దాన ట్ర‌స్టుకు రూ. కోటి విరాళం

    Spread the love

    Spread the loveదానం చేసిన హైద‌రాబాద్ భ‌క్తుడు తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే తిరుమ‌ల లో కొలువై ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యానికి పెద్ద ఎత్తున విరాళాలు వ‌స్తున్నాయి. హైద‌రాబాద్ కు చెందిన భ‌క్తుడు భారీ విరాళం అందించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *