మ‌హా శివ‌రాత్రికి టీటీడీ ఆల‌యాలు ముస్తాబు

Spread the love

స్ప‌ష్టం చేసిన తిరుప‌తి జిల్లా ఎస్పీ

తిరుప‌తి జిల్లా : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలనే ఉద్దేశంతో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సంద‌ర్భంగా తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టిటిడి ఎస్ఓ మురళీకృష్ణ, టిటిడి జేఈవో వీరబ్రహ్మం సంయుక్తంగా ఉన్నతాధికారులతో కలిసి కపిలతీర్థం, అనుబంధ ఆలయాలను పరిశీలించి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, క్యూలైన్లు , ఇతర మౌలిక వసతులపై క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. అలాగే శ్రీనివాస మంగాపురం, గుడిమల్లం, తదితర ఆలయాలను కూడా సందర్శించి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు.
మహాశివరాత్రి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్నందున, అన్ని శాఖల సమన్వయంతో భక్తులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు తగిన చర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు జేఈవో వీర‌బ్ర‌హ్మం.

  • Related Posts

    అఖండ దీపాన్ని వెలిగించిన బండారు శ్రావ‌ణి శ్రీ‌

    Spread the love

    Spread the loveశ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అనంత‌పురం జిల్లా : ప్ర‌తి ఏటా నిర్వ‌హించే అనంత‌పురం జిల్లాలోని బుక్కరాయ సముద్రంలో శ్రీ శ్రీ శ్రీ కొండమీదరాయుడు స్వామి వారి మహోత్సవం అంగ రంగ వైభ‌వోపేతంగా జ‌రిగింది.…

    ఘనంగా శ్రీ కోదండ రామస్వామి పేట ఉత్సవం

    Spread the love

    Spread the loveతండోప తండాలుగా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి పేట ఉత్సవం ఘనంగా జరిగింది. మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి ఉత్సవ మూర్తులను కూపుచంద్రపేట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *