ఆర్ఎస్ఎస్ చీఫ్ తో సినీ తార‌ల భేటీ

ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్స‌వం

ముంబై : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 100వ వార్షికోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది మ‌రాఠా లోని ముంబై న‌గ‌రంలో. దేశానికి చెందిన వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు , సినీ తార‌లు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ను క‌లిసేందుకు బారులు తీరారు. ఆయ‌న‌తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యేందుకు పోటీ ప‌డ్డారు. ఇందులో సినీ న‌టులు ఉన్నారు. రూపా గంగోలీతో పాటు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి శిల్పా శెట్టి కూడా మోహ‌న్ భ‌గ‌వ‌త్ తో చ‌ర్చించారు.

ఈ సంద‌ర్బంగా ఈ ఇద్ద‌రు న‌టులు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భారత దేశాన్ని ప్ర‌భావితం చేస్తున్న వ్య‌క్తుల‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ఒక‌రు అని పేర్కొన్నారు. ఈ కీల‌క స‌మ‌యంలో త‌న‌తో భేటీ కావ‌డం మ‌రింత ఆనందంగా ఉంద‌న్నారు రూపా గంగూలీ, శిల్పా శెట్టి. ఆర్ఎస్ఎస్ వంద‌వ వార్షికోత్స‌వ వేడుక‌ల‌లో భాగం కావ‌డం తాము జీవితంలో మ‌రిచి పోలేమ‌ని అన్నారు. ఈ చారిత్రాత్మ‌క సంద‌ర్బంలో భాగ‌మైనందుకు సంతోషంగా ఉంద‌న్నారు.

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *