ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

స్ప‌ష్టం చేసిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : ఈసారి ప్ర‌వేశ పెట్టిన తాజా బ‌డ్జెట్ లో కూట‌మి స‌ర్కార్ ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చింద‌ని అన్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని అన్నారు. నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫార్మింగ్ పథకం సాయంతో రాష్ట్రంలోని అన్ని మండలాల పరిధిలో 8,357 గ్రామాల్లో A.P.C.N.F (AP కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్) కార్యక్రమాలు అమలు చేస్తున్నామ‌ని తెలిపారు. ఉత్తమ ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబిస్తున్న 12,319 మంది ఛాంపియన్ రైతులను క్షేత్ర స్థాయి రైతు శిక్షకులుగా తయారు చేశామ‌న్నారు. వారిలో 66 శాతం మంది మహిళలు ఉండడం విశేషమ‌ని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు.

ప్రకృతి వ్యవసాయ ఉపకరణాలు అందుబాటులో ఉంచడానికి 1,712 బయో సెంటర్లు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. 2.83 లక్షల మంది రైతులు, 3.55 లక్షల ఎకరాలలో రసాయన రహిత S2S వ్యవసాయాన్ని అనుసరించారని పేర్కొన్నారు. 10.38 లక్షల మంది ప్రకృతి వ్యవసాయ రైతులు PGS సర్టిఫికేషన్లో నమోదు చేసుకున్నారని చెప్పారు. 33 వేల మంది రైతులు స్కోప్`ఆర్గానిక్ ధృవీకరణ పత్రాన్ని పొందార‌ని అన్నారు . .2026-27లో APCNF మొత్తం బడ్జెట్ ప్రతిపాదనలు-208.05 కోట్ల రూపాయలు. రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి కీలకంగా నిలుస్తున్న వ్యవసాయ శాఖకు 2026-27 వార్షిక బడ్జెట్‌లో మొత్తం రూ 12,152.32 కోట్లు ప్రతిపాదించ‌డం జ‌రిగింద‌న్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *