ఆదాయంలో ముంబై కార్పొరేష‌న్ నెంబ‌ర్ వ‌న్

Spread the love

2వ స్థానంలో బెంగ‌ళూరు, 3వ ప్లేస్ లో న్యూఢిల్లీ
హైద‌రాబాద్ : మ‌హారాష్ట్ర‌లోని బృహ‌న్న ముంబై కార్పొరేష‌న్ చ‌రిత్ర సృష్టించింది. రికార్డు స్థాయిలో గ‌ణ‌నీయ‌మైన ఆదాయ‌న్ని గ‌డించింది. ఈ సంద‌ర్బంగా అత్య‌ధిక ఆదాయం క‌లిగిన కార్పొరేష‌న్ల జాబితాలో ఏకంగా బీఎంసీ నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది. మౌలిక వసతులు, అభివృద్ధి పనుల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముంబై కార్పొరేష‌న్ రూ. 74,427 కోట్ల‌తో ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా , 2వ స్థానంలో బెంగ‌ళూరు కార్పొరేష‌న్ నిలిచింది. ఈ సంస్థ రూ. 19,930 కోట్ల ఆదాయాన్ని గ‌డించింది. మూడ‌వ స్థానంలో దేశ రాజ‌ధాని న్యూఢిల్లీ కార్పొరేష‌న్ నిలిచింది. ఈ సంస్థ రూ. 16,530 కోట్ల‌తో ఆదాయ‌న్ని గ‌డించింది.

ఇక కార్పొరేష‌న్ల జాబితాలో రూ. 15,502 కోట్ల‌తో గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్ కార్పొరేష‌న్ నిల‌వ‌గా , 5వ స్థానంలో రూ. 12, 618 కోట్ల‌తో పూణే కార్పొరేష‌న్ , 6వ స్థానంలో రూ. 11, 460 కోట్ల‌తో హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ఎంసీ) నిలిచింది. ఇక 7వ ప్లేస్ లో రూ. 8,400 కోట్ల‌తో చెన్నై కార్పొరేష‌న్ నిల‌వ‌గా , త‌ర్వాతి స్థానాల‌లో కోల్ క‌తా కార్పొరేష‌న్ రూ. 5,166 కోట్లతో, విశాఖ‌ప‌ట్నం కార్పొరేష‌న్ రూ. 4, 672 కోట్ల‌తో 10వ స్థానంలో నిలిచింది.

  • Related Posts

    మహనీయుడు సంత్ సేవాలాల్ మ‌హారాజ్

    Spread the love

    Spread the loveనివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను…

    ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఈసారి ప్ర‌వేశ పెట్టిన తాజా బ‌డ్జెట్ లో కూట‌మి స‌ర్కార్ ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇచ్చింద‌ని అన్నారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. ప్రకృతి వ్యవసాయంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *