అంగ‌రంగ వైభ‌వోగం క్షేత్రపాలకుడికి అభిషేకం

త‌ర‌లి వ‌చ్చిన భ‌క్త బాంధ‌వులు

తిరుమల : తిరుమలలోని గోగర్భం సమీపంలో గల రుద్రుని రూపమైన క్షేత్ర పాలకుడికి ఆదివారం వేడుకగా అభిషేకం జరిగింది. తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్న రుద్రునికి మహా శివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకున్నారు. పాలు, పెరుగు, చందనం, పన్నీరు, కొబ్బరినీళ్లు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తర్వాత నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఇదిలా ఉండ‌గా టీటీడీ ఆధ్వ‌ర్యంలో మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముంద‌స్తుగా భ‌ద్ర‌త‌ను క‌ల్పించారు. తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించారు. అన్న ప్ర‌సాద విత‌ర‌ణ చేప‌ట్టారు. భ‌క్తులు సంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    ‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

    హైద‌రాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్ర‌దాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘ‌నంగా. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జంట నగరాల భ‌క్తులంద‌రికీ శుభాకాంక్షలు తెలిపారు. హైద‌రాబాద్ ప్రజల జీవన విధానం,…

    టీటీడీకి రూ.60.61 లక్షల భారీ విరాళం

    తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తులు పోటెత్తారు. కోరిన కోర్కెలు తీర్చే క‌లియుగ దైవంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పేరు పొందారు. ఇందులో భాగంగా సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున శ్ర‌మ‌కోర్చి స్వామిని ద‌ర్శించుకునేందుకు పోటీ ప‌డుతుంటారు. గ‌త…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *