ఏపీకి విచ్చేసిన టెక్నాలజీ దిగ్గజం
అమరావతి : ప్రపంచ టెక్ దిగ్గజం, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఏపీలో కాలు మోపారు. ఆయనకు గంగవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. భారీ భద్రత నడుమ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా రాష్ట్ర రాజధాని అమరావతి నగరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి సచివాలయానికి చేరుకున్నారు బిల్ గేట్స్. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. సెక్రటేరియట్ లోని మొదటి బ్లాక్ లో బిల్ గేట్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు స్వాగతించారు.
నాయుడు మంత్రులను బిల్ గేట్స్ కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈరోజు గన్నవరం విమానాశ్రయంలో గేట్స్ ఫౌండేషన్ చైర్ ను సహచర మంత్రులు హోం శాఖ మంత్రి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ లతో కలిసి ఆహ్వానం పలకడం ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతికత ఆధారిత పాలనలో భాగస్వామ్యాలను బలోపేతం చేయడంపై చర్చించనున్నట్లు వెల్లడించారు. గేట్స్ ఫౌండేషన్ తో కలిసి పని చేసేందుకు ఏపీ రాష్ట్రం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు నారా లోకేష్.





