నంది వాహనం కైలాసనాథుడి ద‌ర్శ‌నం

Spread the love

శ్రీ క‌పిలేశ్వ‌ర స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి : తిరుపతి లోని శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహా శివరాత్రి పర్వదినం రోజైన రాత్రి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామి నంది వాహనంపై అభయమిచ్చారు. భజన మండళ్ల కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో సాయంత్రం 6 గంటల నుండి వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా భక్తులు వాహన సేవకు విచ్చేసి కర్పూర హారతులు సమర్పించారు. మ‌హా విష్ణువుకు గరుడ వాహనం ఎంత ప్రీతికరమైనదో పరమేశ్వరునికి నంది వాహనం అంత విశిష్టమైనది.
ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ సోమ‌వారం తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహించారు.

ఉదయం 8 గంటల నుండి భక్తులను సర్వ దర్శనం కోసం బారులు తీరిన భ‌క్తుల‌ను ఆల‌య నిర్వాహ‌కులు, పూజారులు అనుమ‌తి ఇచ్చారు. టీటీడీ ఆధ్వ‌ర్యంలో జేఏఓ వి. వీర‌బ్ర‌హ్మం సార‌థ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. సుదూర ప్రాంతాల నుండి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ఇదిలా ఉండ‌గా వాహ‌న సేవ‌లో టీటీడీ సివిఎస్వో కే.వి.ముర‌ళికృష్ణ‌, ఆలయ ప్ర‌త్యేకాధికారి డి.ఫ‌ణి కుమార్ నాయుడు, సూపరింటెండెంట్ చంద్ర‌శేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌క‌లు విశేష‌ సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

  • Related Posts

    మే 01 నుండి శ్రీ వేద నారాయ‌ణ స్వామి బ్ర‌హ్మ‌త్స‌వాలు

    Spread the love

    Spread the loveఘ‌నంగా ఏర్పాట్లు చేసిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం తిరుప‌తి : నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 1 నుండి 9వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 30వ తేదీ…

    టీటీడీ ప్రాణ దాన ట్ర‌స్టుకు రూ. కోటి విరాళం

    Spread the love

    Spread the loveదానం చేసిన హైద‌రాబాద్ భ‌క్తుడు తిరుమ‌ల : కోరిన కోర్కెలు తీర్చే తిరుమ‌ల లో కొలువై ఉన్న శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యానికి పెద్ద ఎత్తున విరాళాలు వ‌స్తున్నాయి. హైద‌రాబాద్ కు చెందిన భ‌క్తుడు భారీ విరాళం అందించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *