newsseals.com
News

బంగ్లాదేశ్ ప్ర‌ధానిగా కొలువు తీరిన తారిఖ్ రెహ‌మాన్

VijayaBhaskar February 18, 2026
newsseals-BangladeshPM
Spread the love

అభినందించిన ప్ర‌ధాని నరేంద్ర మోదీ, స్పీక‌ర్ ఓం బిర్లా

బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ పీపుల్స్ రిపబ్లిక్ ప్రభుత్వ ప్రధానమంత్రిగా బిఎన్‌పి చైర్మన్ తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో జరిగిన ఘోరమైన తిరుగుబాటు తర్వాత ఎన్నికైన మొదటి ప్రతినిధులుగా నిలిచారు. 35 సంవత్సరాలలో 170 మిలియన్ల జనాభా కలిగిన దేశంలో అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి వ్య‌క్తిగా రెహమాన్ నిలిచారు. బంగ్లాదేశ్ పార్లమెంటు కొత్త సభ్యులతో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏఎన్ఎం నాసిర్ ఉద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు.

రెహమాన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 297 సీట్లలో 209 సీట్లను గెలుచుకోగా, కుడి-వింగ్ జమాత్-ఇ-ఇస్లామి 13వ పార్లమెంటరీ ఎన్నికల్లో 68 సీట్లను గెలుచుకుంది. పదవీచ్యుతురాలైన‌ ప్రధానమంత్రి షేక్ హసీనా అవామీ లీగ్ ఎన్నికలలో పోటీ చేయకుండా నిషేధించింది స‌ర్కార్. ఢాకాలోని జాతీయ పార్లమెంట్ భవనం సౌత్ ప్లాజాలో జరగనున్న కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బంగ్లాదేశ్ , విదేశాల నుండి సుమారు 1,200 మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సంద‌ర్బంగా భారతదేశం నుండి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రమాణ స్వీకారానికి హాజ‌రైన పీఎంతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు.