స్పష్టం చేసిన మంత్రి ఎస్. సవిత
అమరావతి : గత ప్రభుత్వం బహుజనుల బాగోగులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. బీసీల అభ్యున్నతి కోసం తమ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏపీలో ఎస్సీ వర్గీకరణంపై నియమించిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా విజయవంతమైన పాత్ర పోషించిందని మంత్రి సవిత తెలిపారు. రాజీవ్ రంజాన్ మిశ్రా సమర్థత గుర్తించిన సీఎం చంద్రబాబు నాయుడు… ఆయన నేతృత్వంలో డెడికేటెట్ కమిషన్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఈ కమిషన్ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజీవ్ రంజన్ మిశ్రా ఏక సభ్య డెడికేటెడ్ కమిషన్ నియమించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు. ఇదిలా ఉండగా ఈసారి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సారథ్యంలో తయారు చేసిన 2026-27 బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేకూర్చేలా ఉందన్నారు. ఈసారి బడ్జెట్ లో బీసీల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. డెడికేటెట్ కమిషన్ నియామకంపై బీసీ సంఘాలు సైతం హర్షం వ్యక్తం చేశాయి. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, మంత్రులు లోకేశ్, సవితకు కృతజ్ఞతలు తెలియజేశారు.






