పోలీసుల‌కు మాన‌సిక ఉల్లాసం అవ‌స‌రం

Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విధి నిర్వ‌హ‌ణ‌లో రేయింబ‌వ‌ళ్లు ప‌ని చేస్తుంటార‌ని వారి చేస్తున్న సేవ‌ల గురించి ఎంత చెప్పినా తక్కువేన‌ని అన్నారు. శుక్ర‌వారం అమరావతిలోని మంగళగిరి 6వ బెటాలియన్ APSP వేదికగా జరిగిన “రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్”ను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఘనంగా ప్రారంభించారు అనిత వంగ‌ల‌పూడి. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నార‌ని చెప్పారు.

ఈ త‌రుణంలో ఇలాంటి జాతీయ స్థాయి పోలీస్ క్రీడా పోటీలు నిర్వ‌హించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. తాను హొం శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో వీటిని ప్రారంభించే ఛాన్స్ ద‌క్క‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. నిరంతరం ప్రజా భద్రత కోసం 24 గంటలు శ్రమించే మన పోలీసు సోదరులకు మానసిక ఉల్లాసం, ఐక్యతను పెంపొందించడానికి ఇటువంటి క్రీడలు ఎంతో అవసరం అన్నారు వంగ‌ల‌పూడి అనిత‌. సుమారు 6 రాష్ట్రాల నుండి వచ్చిన 10 జట్లకు శుభాకాంక్ష‌లు తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓట‌ముల కంటే క్రీడా స్ఫూర్తితో పాల్గొనడమే ముఖ్యమ‌ని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    జ‌గ‌న్ డైవ‌ర్ష‌న్ రాజ‌కీయాలు న‌డ‌వ‌వు

    Spread the love

    Spread the loveనిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత హైద‌రాబాద్ : రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె శుక్ర‌వారం శాస‌న స‌భ‌లో మీడియా పాయింట్ వ‌ద్ద మాట్లాడారు. అసెంబ్లీ, శాస‌న మండ‌లి…

    ఆంటోనియో గుటెర్రెస్ తో పీఎం భేటీ

    Spread the love

    Spread the loveప్ర‌పంచాన్ని శాసిస్తున్న ఏఐ పై చ‌ర్చ న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌తో శుక్ర‌వారం చ‌ర్చ‌లు జ‌రిపారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఢిల్లీలో ఇండియా ఇంపాక్ట్ ఏఐ స‌మ్మిట్ 2026లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఇరువురి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *