దేవాదుల ప్రాజెక్టును ప‌ట్టించుకోని స‌ర్కార్

Spread the love

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

సంగారెడ్డి జిల్లా : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, ఎవ‌రు ఏం చేస్తున్నారో తెలియ‌డం లేద‌న్నారు. ప్రాజెక్టులు నీరుగారి పోయాయ‌ని, వాటిని ప‌ట్టించు కోవ‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు మీద రూ.7,300 కోట్లు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తి చేశామ‌ని అన్నారు. కాగా 47 వేలు ఉన్న ఆయకట్టును 3 లక్షల 17 వేల ఎకరాలకు పెంచడం జ‌రిగింద‌న్నారు. 33 వేల ఎకరాలు ఈ ప్రాజెక్టుకు అవసరం ఉంటే, 30 వేల ఎకరాలు భూసేకరణ కూడా పూర్తి చేశామ‌న్నారు.

ఇంకొక 3వేల ఎకరాలు భూసేకరణ చేసి, దాదాపు రూ.1,000 నుండి రూ.2,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకో 2,40,000 ఎకరాల ఆయకట్టు సృష్టించ వ‌చ్చ‌ని అన్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర ఏండ్లలో కనీసం రూ.100 కోట్లు కూడా ఖర్చు చేయ‌లేదంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర ద‌క్క‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇచ్చిన హామీల‌ను అమ‌లు ప‌ర్చ‌డంలో కాంగ్రెస్ స‌ర్కార్ ఘోరంగా విఫ‌లం చెందింద‌ని ధ్వ‌జ‌మెత్తారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

  • Related Posts

    జ్ఞాన బాండాగారాలుగా గ్రంథాల‌యాలు ఉండాలి

    Spread the love

    Spread the loveకీల‌క సూచ‌న‌లు చేసిన మంత్రి నారా లోకేష్ అమ‌రావ‌తి : జీవితంలో అత్యున్న‌త‌మైన స్థానానికి చేరుకోవాలంటే త‌ప్ప‌కుండా పుస్త‌కాలు చద‌వాల‌ని అన్నారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో…

    పట్టణాల అబివృద్ది కోసం ప్ర‌త్యేక‌ నిధులు తెస్తాం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ జిల్లా : టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే రాజ‌కీయాలు ఉంటాయ‌ని, ఆ త‌ర్వాత అన్ని పార్టీలు క‌లిసిక‌ట్టుగా ముందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *