దేవాదుల ప్రాజెక్టును ప‌ట్టించుకోని స‌ర్కార్

Spread the love

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు

సంగారెడ్డి జిల్లా : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, ఎవ‌రు ఏం చేస్తున్నారో తెలియ‌డం లేద‌న్నారు. ప్రాజెక్టులు నీరుగారి పోయాయ‌ని, వాటిని ప‌ట్టించు కోవ‌డం లేదంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ప్రాజెక్టు మీద రూ.7,300 కోట్లు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తి చేశామ‌ని అన్నారు. కాగా 47 వేలు ఉన్న ఆయకట్టును 3 లక్షల 17 వేల ఎకరాలకు పెంచడం జ‌రిగింద‌న్నారు. 33 వేల ఎకరాలు ఈ ప్రాజెక్టుకు అవసరం ఉంటే, 30 వేల ఎకరాలు భూసేకరణ కూడా పూర్తి చేశామ‌న్నారు.

ఇంకొక 3వేల ఎకరాలు భూసేకరణ చేసి, దాదాపు రూ.1,000 నుండి రూ.2,000 కోట్లు ఖర్చు పెడితే ఇంకో 2,40,000 ఎకరాల ఆయకట్టు సృష్టించ వ‌చ్చ‌ని అన్నారు త‌న్నీరు హ‌రీశ్ రావు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర ఏండ్లలో కనీసం రూ.100 కోట్లు కూడా ఖర్చు చేయ‌లేదంటూ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర ద‌క్క‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇచ్చిన హామీల‌ను అమ‌లు ప‌ర్చ‌డంలో కాంగ్రెస్ స‌ర్కార్ ఘోరంగా విఫ‌లం చెందింద‌ని ధ్వ‌జ‌మెత్తారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

  • Related Posts

    ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం స‌బ‌బే

    Spread the love

    Spread the loveమ‌రాఠా మంత్రి గిరీష్ మ‌హాజ‌న్ కామెంట్స్ ముంబై : దేశ వ్యాప్తంగా సంచల‌నంగా మారారు మంత్రి మ‌రాఠాకు చెందిన గిరీష్ మ‌హాజ‌న్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధ‌వారం స్పందించారు. అది తప్పు అని నేను అనను అన్నారు.…

    రేపే త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల పోలింగ్

    Spread the love

    Spread the loveఏర్పాట్లు చేశామ‌న్న ఎన్నిక‌ల క‌మిష‌న్ చెన్నై | త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నిక‌ల‌కు సంబంధించి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ. ఎంసీసీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి అడ్డగించిన మొత్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *