ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్ కు సంబంధం లేదు

స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న తమ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న హెరిటేజ్ సంస్థ‌పై అన‌వ‌స‌ర రాద్దాంతం చేస్తున్న‌రంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌త్యేకించి ప‌నిగ‌ట్టుకుని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆయ‌న ప‌రివారం కావాల‌ని బ‌ద్నాం చేస్తున్నారంటూ ఆరోపించారు. ‘హెరిటేజ్’ గురించి అసెంబ్లీలో మాట్లాడారు. ‘హెరిటేజ్’ మా కుటుంబ వ్యాపార సంస్థ అని చెప్పారు. ప్రభుత్వ సంస్థలకు ఎక్కడా మా ఉత్పత్తులు సరఫరా కాలేదని స్ప‌ష్టం చేశారు. వాళ్ల పత్రికలో మాత్రం హెరిటేజ్‌కు వ్యతిరేకంగా కథనాలు రాశార‌ని ఆరోపించారు. .ప్రభుత్వ సహకారం లేకుండా హెరిటేజ్ నిజాయతీగా వ్యాపారం చేస్తోందని స్ప‌ష్టం చేశారు సీఎం.

నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డెయిరీకి ముడిపెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు . హెరిటేజ్ డెయిరీ నిత్యం 20 లక్షల లీటర్ల పాలు సేకరిస్తోందని చెప్పారు. నెయ్యి విషయంలో ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు సంబంధం లేద‌ని అన్నారు. హెరిటేజ్ సంస్థ ఎప్పుడూ తప్పుడు పనులు చేయదని మ‌రోసారి కుండ బ‌ద్ద‌లు కొట్టారు . హెరిటేజ్ ఉత్ప‌త్తుల‌కు సంబంధించి వైసీపీ చేస్తున్న ఆరోప‌ణ‌లు పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని, అబ‌ద్ద‌మ‌ని మండిప‌డ్డారు నారా చంద్ర‌బాబు నాయుడు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *