newsseals.com
ENTERTAINMENT

అసభ్య కామెంట్స్ పై లావ‌ణ్య త్రిపాఠి ఫిర్యాదు

VijayaBhaskar March 11, 2026
newsseals-LavanyaTripathi
Spread the love

ఇప్ప‌టికే ఫిర్యాదు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టీమ‌ణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్ర‌త్యేకించి సోష‌ల్ మీడియాలో వేధింపుల ప‌ర్వం ప‌రాకాష్ట‌కు చేరుకుంది. ప్ర‌త్యేకించి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేయ‌డం, మాన‌సికంగా కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది న‌టి లావ‌ణ్య త్రిపాఠి. ఇప్ప‌టికే అస‌భ్య కామెంట్స్ గురించి ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య సైబ‌ర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు త‌న జాబితాలో ఇంకో న‌టి లావ‌ణ్య త్రిపాఠి కూడా చేరి పోయింది.

త‌ను కూడా ఆన్‌లైన్ వేధింపులపై ఇవాళ ఫిర్యాదు చేయ‌డం మ‌రింత ఆస‌క్తిని రేపింది. చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌త్యేకించి సోషల్ మీడియాలో తనపై, కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యలు, దూషణలు చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘పర్పుల్ క్రెయాన్00’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అవమానకర పోస్టులు చేస్తున్నారని వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటు బీఎన్ఎస్ 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.