టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్ కు పాజిటివ్

మ‌రో ఆరుగురు డ్ర‌గ్స్ వాడిన‌ట్లు తేలింద‌న్న ఎస్పీ

హైద‌రాబాద్ : తెలంగాణ‌లో కాల్పుల క‌ల‌క‌లం సంచ‌ల‌నం రేపింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డికి చెందిన మోయినాబాద్ ఫామ్ హౌస్ లో ఈగిల్ టీం దాడి చేసింది. ఈ స‌మ‌యంలో ప‌లువురు పొలిటిక‌ల్ లీడ‌ర్లు ఇందులో డ్ర‌గ్స్ వాడుతున్న‌ట్లు తేలింది. దీంతో సిబ్బందిపై రోహిత్ రెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీ కాల్పుల‌కు తెగ‌బ‌డిన‌ట్లు స‌మాచారు. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి తెలుగుదేశం పార్టీకి చెందిన ప్ర‌స్తుత ఏలూరు ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్ యాద‌వ్ తో పాటు రోహిత్ రెడ్డి కూడా డ్ర‌గ్స్ సేవించిన‌ట్లు తేల‌డం విస్తు పోయేలా చేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించారు ఈగిల్ టీం ఎస్పీ గిరిధ‌ర్. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

పోలీసులు జరిపిన దాడిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురు డ్రగ్స్ వాడినట్లు తేలిందన్నారు. ఒక నిర్దిష్ట ఫామ్‌హౌస్‌పై దాడి చేసి, ఒక వ్యక్తి ఆయుధాన్ని ఉపయోగిస్తున్నట్లు గుర్తించామన్నారు. తాము ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించినప్పుడు, మా అధికారులు కొన్ని శబ్దాలు విన్నారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పిస్టల్ పట్టుకున్న ఒక వ్యక్తిని పట్టుకున్నారు. మరొక వ్యక్తి వద్ద కొన్ని ఖాళీ రౌండ్లు కూడా ఉన్నాయి. అధికారులు 11 మందిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వారికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా, వారిలో 5 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు ఎస్పీ. తాము అన్ని విధానపరమైన కార్యకలాపాలను నిర్వహించామన్నారు వారిని రక్త నమూనా పరీక్ష కోసం ఆసుపత్రికి తరలించిన‌ట్లు తెలిపారు.. 5 మందితో పాటు ఒక వ్యక్తికి పాజిటివ్ అని తేలిందన్నారు. కాబట్టి, మొత్తం 6 మందికి పాజిటివ్ వ‌చ్చింద‌ని రూఢీ చేసుకున్నామ‌న్నారు. ఇందులో ఒక వ్యక్తి మాజీ ఎమ్మెల్యే అని, మ‌రొక‌రు సిట్టింగ్ ఎంపీ కూడా ఉన్నార‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *