కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కూలీల‌కు శాపం

VijayaBhaskar · March 16, 2026
Spread the love

నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి : కేంద్ర స‌ర్కార్ నిర్వాకం కార‌ణంగా కోట్లాది మంది కూలీల‌కు ఉపాధి లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (MGNREGA) చట్ట పరిరక్షణ యాత్ర పార్వతీపురం మణ్యం జిల్లాకు చేరుకుంది. ఈ సంద‌ర్బంగా ష‌ర్మిలాకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కురుపాం నియోజకవర్గం డంగభద్ర గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి హాజర‌య్యారు పెద్ద ఎత్తున‌ గ్రామస్థులు.

కరువు పని తోనే మణ్యం గ్రామాల్లో రోడ్లు వేసుకున్నామని, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించు కున్నామని , ఇప్పుడు ఉపాధి పనికి కనీసం వేతనాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మన్రేగా పథకానికి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ తెచ్చిన VB G- RAM G చట్టానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు ఈ సంద‌ర్బంగా ష‌ర్మిలా రెడ్డి. కాంగ్రెస్ చేస్తున్న ఉపాధి హామీ చట్ట పునరుద్ధరణకు కురుపాం నియోజక వర్గ ప్రజల మద్దతు తీసుకోవడం జరిగింది. పేద‌ల క‌డుపు నింపుతున్న ఉపాధి హామీ ప‌థ‌కాన్ని పున‌రుద్ద‌రించాల‌ని, కొత్త చ‌ట్టాన్ని ర‌ద్దు చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు.