సంస్థాగ‌త బ‌లోపేతానికి కృషి చేయాలి

స్ప‌ష్టం చేసిన స‌త్య కుమార్ యాద‌వ్

అమ‌రావ‌తి : పార్టీ ప‌రంగా సంస్థాగ‌త ప‌రంగా మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. ఏపీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ” రాష్ట్ర స్థాయి కార్యశాలలో పాల్గొన్నారు . ఈ కార్యశాలలో ముఖ్య అతిథిగా విచ్చేచారు ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ . పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం, కార్యకర్తల పాత్రపై ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు.

ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ , స‌ర్ రాష్ట్ర కన్వీనర్ , ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స‌ర్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. బూత్ స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇదే స‌మ‌యంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ స‌ర్ చరిత్రను, ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను స్పష్టంగా వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి , శాసనసభ బిజెపి పక్ష నేత పెన్మత్స విష్ణు కుమార్ రాజు , ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, BLA-1లు తదితరులు పాల్గొన్నారు.
పార్టీ సంస్థాగత బలోపేతానికి, బూత్ స్థాయి వరకు కార్యకర్తలను మరింత చైతన్యవంతం చేసే దిశగా ఈ రాష్ట్ర కార్యశాల కీలకంగా నిలిచింది.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *