గృహ హింస నిరోధ‌క చ‌ట్టంపై అవ‌గాహ‌న క‌ల్పించాలి

Spread the love

జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ విజ‌య ర‌హ‌త్క‌ర్

నంద్యాల జిల్లా : గృహ హింస నిరోధక చట్టం-2005పై విస్తృత ప్రచారం చేపట్టి, రక్షణ అధికారుల నియామకాన్ని వేగవంతం చేయాలని స్ప‌ష్టం చేశారు జాతీయ మ‌హిళా క‌మిష‌న్ చైర్మ‌న్ విజ‌య ర‌హ‌త్క‌ర్. మహిళా సాధికారత, భద్రత, సంక్షేమం అంశాల్లో సమగ్ర చర్యల ద్వారా నంద్యాల జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నంద్యాల వంటి వ్యవసాయాధారిత జిల్లాల్లో మహిళల భద్రతకు ‘లోకల్ కమిటీ’లు కీలక పాత్ర పోషిస్తాయని, వీటి ఏర్పాటు చట్టపరంగా తప్పనిసరని  పేర్కొన్నారు. గృహ హింస చట్టం అమలులో భాగంగా రక్షణ అధికారులను నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను గుర్తుచేస్తూ, బాధిత మహిళలకు సమయానుకూల సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే, పని ప్రదేశాల్లో మహిళలకు న్యాయం జరిగేలా లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH) కింద కమిటీలు చురుగ్గా పని చేయడం అవసరమని వివరించారు.

మహిళా భద్రత విషయంలో పోలీసు విభాగం అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఫిర్యాదుపై సున్నితంగా, వేగంగా స్పందించాలని కోరారు. ‘శక్తి టీమ్స్’ పనితీరును మరింత మెరుగు పరుస్తూ గ్రామీణ స్థాయిలో కూడా వాటి ఉనికిని పెంచాలని సూచించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా పర్యవేక్షణను బలోపేతం చేయడం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా పోక్సో , గృహ హింస కేసుల్లో త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు త్వరగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, చట్టాల అమలులో ఎటువంటి ఆటంకాలు లేకుండా మహిళల అభివృద్ధిని సాధించడమేనని తెలిపారు. నంద్యాల జిల్లా ఇప్పటి వరకు మంచి పనితీరును కనబర్చిందని ప్రశంసిస్తూ, భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాల కోసం అధికారులు సమన్వయంతో కృషి చేయాలని మహిళా కమిషన్ అధ్యక్షురాలు పిలుపునిచ్చారు.

  • Related Posts

    వ్య‌క్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం

    Spread the love

    Spread the loveస్ప‌ష్టం చేసిన ఏఐసీసీ నేత వేణుగోపాల్ న్యూఢిల్లీ : కేర‌ళ‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌దుప‌రి సీఎంగా వీడీ స‌తీశ‌న్ ను నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఖ‌ర్గే. దీంతో నిన్న‌టి దాకా సీఎం…

    రేపే 12 ప్రాజెక్టుల‌కు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాప‌న‌

    Spread the love

    Spread the loveఇక నుంచి రాయ‌ల‌సీమ రక్ష‌ణ సీమ అమ‌రావ‌తి : సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15న శుక్ర‌వారం రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.ఉదయం 08:15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *