బాలీవుడ్ ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన శివ‌సేన నాయ‌కురాలు

ముంబై : ప్ర‌ముఖ నటి , నృత్యకారిణి నోరా ఫతేహి వివాదాస్పద పాటపై తీవ్రంగా స్పందించారు శివసేన నాయకురాలు షైనా ఎన్.సి. శుక్ర‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. బాలీవుడ్ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు, ఎందుకంటే లైంగికంగా ప్రేరేపించే లేదా అభ్యంతరకరమైన ఎలాంటి కంటెంట్ అయినా, సమాజంలో మెరుగైన విలువ వ్యవస్థలను నిలబెట్టడమే లక్ష్యంగా ఉన్న భారతీయ న్యాయ సంహిత వంటి చట్టాల ఉద్దేశ్యానికి విరుద్ధంగా ఉంటుంద‌ని అన్నారు. అటువంటి కంటెంట్ ముసుగులో ఉన్న భావప్రకటనా స్వేచ్ఛ కంటే మన సంస్కృతి, సభ్యత చాలా ముఖ్యం అని స్ప‌ష్టం చేశారు షైనా ఎన్సీ.

సమాజంలో అశ్లీలత లేదా అసభ్యత లేకుండా చూసేందుకే జాతీయ మహిళా కమిషన్ వంటి సంస్థలను ఏర్పాటు చేశారని గుర్తు పెట్టుకోవాల‌ని అన్నారు. తాము చేస్తున్నామ‌ని, జ‌నం చూస్తున్నార‌ని ఎలా ప‌డితే అలా చేసుకుంటూ పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. మ‌నం కూడా స‌మాజంలో నివ‌సిస్తున్నామ‌నే సోయి లేకుండా ఎలా ప‌డితే అలా బ‌ట్ట‌లు విప్పేస్తూ, స‌భ్య స‌మాజం త‌ల దించుకునేలా నాట్యం చేయ‌డం, అంత‌కు మించి జుగుస్సాక‌రంగా పాట‌ల‌ను స్వ‌ర ప‌ర్చ‌డం మామూలై పోయింద‌న్నారు.

  • Related Posts

    పాన్ మ‌సాలా ప్ర‌చారంపై బాలీవుడ్ న‌టుల‌కు నోటీసులు

    ముంబై : విమల్ యాలాకుల‌ ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్‌గన్ , టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఎఫ్‌డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన ప్రాథమికంగా నిషేధిత పాన్ మసాలా , పొగాకు సంబంధిత ఉత్పత్తుల…

    జై శ్రీ‌రామ్ పేరుతో దాడులు చేస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె తాజాగా హిందూ సంస్థ‌ల‌ను టార్గెట్ చేశారు. మ‌రో వివాదానికి తెర తీశారు. ప్ర‌స్తుతం దేశంలో హిందూ సంస్థ‌ల హ‌వా కొన‌సాగుతోంది. ‘జై శ్రీరామ్’ నినాదాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *