రిషబ్ పంత్ ను వ్య‌తిరేకించినా ఎంపిక చేశా

Spread the love

మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ : బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్ట‌ర్ ఎంఎస్కే ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను రిష‌బ్ పంత్ ఎంపిక‌పై గ‌తంలో చోటు చేసుకున్న ప‌రిణామాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. 2018లో రిషబ్ పంత్‌ను టెస్ట్ క్రికెట్‌కు ఎంపిక చేయడాన్ని యావత్ యాజమాన్యం వ్యతిరేకించిందని ఆయన వెల్లడించారు. పంత్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని అందరూ వ్యతిరేకించార‌ని, కానీ ఎంఎస్‌కే ప్రసాద్ మెజారిటీ అభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లి అతనికి మద్దతు ఇచ్చాన‌ని చెప్పాడు. తాము అతడిని టెస్ట్ జట్టులో చూడలేము అని యాజమాన్యం స్పష్టంగా చెప్పిందని కూడా ఆయన పంచుకున్నారు. అయినప్పటికీ తాను అతని ఎంపిక కోసం పట్టుబట్టినట్లు పేర్కొన్నాడు ఎంఎస్కే ప్ర‌సాద్.

రిష‌బ్ పంత్ వారి అంచనాలను తప్పు అని నిరూపించాడని, త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడ‌ని ప్లేయ‌ర్ గా వంద మార్కులు పొందాడ‌ని చెప్పాడు . ఒక మ్యాచ్‌లో, అతను వికెట్ కీపర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డును నెలకొల్పాడు . అంతే కాకుండా ఆ తర్వాతి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడని తెలిపాడు మాజీ చీఫ్ సెలెక్ట‌ర్. ప్ర‌స్తుతం రిషబ్ పంత్ భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పరిగణించబడుతున్నాడని తెలిపాడు.

  • Related Posts

    ఐర్లాండ్ సీరీస్ షెడ్యూల్ రిలీజ్ : బీసీసీఐ

    Spread the love

    Spread the love19 ఏళ్ల త‌ర్వాత సీరీస్ ఆడ‌నున్న భార‌త జ‌ట్టు ముంబై : బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. చాన్నాళ్ల త‌ర్వాత ఐర్లాండ్ తో సీరీస్ ఆడేందుకు షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. 19 ఏళ్ల తర్వాత టీం ఇండియా…

    ఆట‌గాళ్లు సంజు శాంస‌న్ ను చూసి నేర్చుకోవాలి

    Spread the love

    Spread the loveకీల‌క వ్యాఖ్య‌లు చేసిన మాజీ క్రికెట‌ర్ వెంగ్ స‌ర్కార్ ముంబై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ స‌ర్కార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ , ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *