రిషబ్ పంత్ ను వ్య‌తిరేకించినా ఎంపిక చేశా

మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ : బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్ట‌ర్ ఎంఎస్కే ప్ర‌సాద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌ను రిష‌బ్ పంత్ ఎంపిక‌పై గ‌తంలో చోటు చేసుకున్న ప‌రిణామాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. 2018లో రిషబ్ పంత్‌ను టెస్ట్ క్రికెట్‌కు ఎంపిక చేయడాన్ని యావత్ యాజమాన్యం వ్యతిరేకించిందని ఆయన వెల్లడించారు. పంత్‌ను జట్టులోకి తీసుకోవడాన్ని అందరూ వ్యతిరేకించార‌ని, కానీ ఎంఎస్‌కే ప్రసాద్ మెజారిటీ అభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లి అతనికి మద్దతు ఇచ్చాన‌ని చెప్పాడు. తాము అతడిని టెస్ట్ జట్టులో చూడలేము అని యాజమాన్యం స్పష్టంగా చెప్పిందని కూడా ఆయన పంచుకున్నారు. అయినప్పటికీ తాను అతని ఎంపిక కోసం పట్టుబట్టినట్లు పేర్కొన్నాడు ఎంఎస్కే ప్ర‌సాద్.

రిష‌బ్ పంత్ వారి అంచనాలను తప్పు అని నిరూపించాడని, త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నాడ‌ని ప్లేయ‌ర్ గా వంద మార్కులు పొందాడ‌ని చెప్పాడు . ఒక మ్యాచ్‌లో, అతను వికెట్ కీపర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డును నెలకొల్పాడు . అంతే కాకుండా ఆ తర్వాతి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడని తెలిపాడు మాజీ చీఫ్ సెలెక్ట‌ర్. ప్ర‌స్తుతం రిషబ్ పంత్ భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా పరిగణించబడుతున్నాడని తెలిపాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *