newsseals.com
SPORTS

ఐర్లాండ్ సీరీస్ షెడ్యూల్ రిలీజ్ : బీసీసీఐ

VijayaBhaskar March 22, 2026
newsseals-BCCI
Spread the love

19 ఏళ్ల త‌ర్వాత సీరీస్ ఆడ‌నున్న భార‌త జ‌ట్టు

ముంబై : బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. చాన్నాళ్ల త‌ర్వాత ఐర్లాండ్ తో సీరీస్ ఆడేందుకు షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. 19 ఏళ్ల తర్వాత టీం ఇండియా ఆడ‌నుంది. ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు, జూన్ 26 , 28 తేదీల్లో ఐర్లాండ్‌తో భారత జట్టు రెండు T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. సీరీస్ లో భాగంగా టీం ఇండియా రెండు టి20 మ్యాచ్ లు ఆడ‌నుంది. ఈ రెండు మ్యాచ్‌లు బెల్‌ఫాస్ట్‌లోనే జరగనున్నాయి.
2026 T20 ప్రపంచ కప్ తర్వాత భారత్ ఆడనున్న మొట్టమొదటి T20 అంతర్జాతీయ సిరీస్ ఇదే కానుంది;
ప్రపంచ కప్ ముగిసిన తర్వాత, భారత ఆటగాళ్లు దాదాపు రెండు నెలల పాటు ఐపీఎల్ లో బిజీగా గడపనున్నారు.

ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) ముగిసిన అనంతరం, ఒకే టెస్టు మ్యాచ్, మూడు వన్డేల సిరీస్‌తో కూడిన సిరీస్‌లో భారత్, ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఈ వన్డే సిరీస్ జూన్ 20న ముగుస్తుంది, ఆ తర్వాత జూలై 1న జరిగే మొదటి T20తో భారత్ తన ఇంగ్లాండ్ పర్యటనను ప్రారంభించనుంది. గత ఎనిమిదేళ్లలో (2018, 2022, 2023) మూడుసార్లు ఐర్లాండ్‌లో పర్యటించిన భారత్, 2007 తర్వాత బెల్‌ఫాస్ట్‌కు తిరిగి రావడం ఇదే మొదటిసారి అవుతుంది అని బీసీసీఐ వెల్ల‌డించింది.