ఎంఐఎం చీఫ్ నాకు మంచి మిత్రుడు

కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే

ఢిల్లీ: కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ ఓవైసీ (అసదుద్దీన్) తో గ‌త కొన్నేళ్లుగా స్నేహం ఉంద‌న్నాడు. అంతేకాక మాకు ఒక మంచి మిత్రుడు కూడా అని తెలిపాడు. ముస్లిం సమాజంలో తన పార్టీ ప్రభావాన్ని విస్తరించడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకుంటే, అది ఖచ్చితంగా స్వాగతించదగిన పరిణామం అన్నారు రామ్ దాస్ అథ‌వాలే. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి రాజకీయ పార్టీకీ ఉంటుందన్నారు.

అయితే, నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రజలు స్పష్టంగా నిర్ణయించుకున్నారని ఆశాభావం వ్య‌క్తం చేశారు కేంద్ర మంత్రి. గ‌త కొన్నేళ్లుగా అక్క‌డ రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. అందుకే జ‌నం మార్పును కోరుకుంటున్న‌ట్లు చెప్పారు . ప్ర‌జ‌ల తీర్పు స్ప‌ష్టంగా ఉంద‌ని, దీనిని ఎవ‌రూ మార్చ‌లేర‌ని పేర్కొన్నారు కేంద్ర మంత్రి. ఇప్ప‌టికే అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నాశ‌నం చేశారంటూ ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు టీఎంసీ స‌ర్కార్ ను, సీఎం దీదీని.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *